NGKL: పెద్దకొత్తపల్లి మండలం బాచారం గ్రామంలో మంగళవారం జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో అగ్రికల్చర్ ఆఫీసర్ శిరీష పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులకు సేంద్రియ పద్ధతులను అనుసరించవలసిన అవసరాన్ని, ప్రకృతి వ్యవసాయం ప్రజల సంక్షేమానికి ఉపకరిస్తుందని వివరించారు. నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, జీవామృతం వంటి కషాయాల తయారీ విధానాలను రైతులకు వివరించారు.