SKLM: ప్రభుత్వం ఆదేశాల మేరకు శ్రీకాకుళం మున్సిపాలిటీలోని అరసవల్లి మున్సిపల్ హై స్కూల్లో అభ్యాసకులకు అక్షరాస్యత పరీక్షను అధికారులు ఆదివారం నిర్వహించారు. ఈ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సందర్శించారు. పరీక్ష నిర్వహణ తీరును అధికారులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో శత శాతం అక్షరాస్యత లక్ష్యం అని అన్నారు.