UPలోని బరేలీలో దారుణం చోటుచేసుకుంది. సునీల్(45) అనే వ్యక్తి తన ఇంటికి సమీపంలోని చెట్టు కింద నిద్రిస్తున్నాడు. పారిశుద్ధ్య సిబ్బంది అతన్ని గుర్తించకుండా ట్రాక్టర్ మట్టి లోడ్ తీసుకొచ్చి అతనిపై పోసేశారు. దీంతో ఊపిరాడక సునీల్ మృతి చెందాడు. అనంతరం, కుమారుడు తన తండ్రి మృతదేహాన్ని గుర్తించి స్థానికుల సాయంతో వెలికితీశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.