AKP: సబ్బవరం మండలం గొల్లలపాలెం సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పంచాయతీ స్వీపర్ కొమ్ము దుర్గాలు (65) దుర్మరణం చెందాడు. ఇంటి నుంచి గొల్లల పాలెం పంచాయితీ కార్యాలయానికి బైక్ పై వెనక కూర్చుని వెళుతుండగా ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దుర్గాలు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.