KMM: పాల్వంచ మండలానికి చెందిన ఓ యువతి (19) వరంగల్లో డిగ్రీ చదువుతోంది. సెలవులు కావటంతో ఇంటికి వచ్చింది. ఇంట్లో ఏ పనులు చేయడం లేదని తల్లిదండ్రులు మందలించడంతో ఆమె మన స్తాపానికి గురైంది. శనివారం ఇంటివద్ద పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను వెంటనే కుటుంబీకులు పాల్వంచ సీహెచ్సీకి తరలించగా వైద్యులు చికిత్స చేశారు.