ASR: ముంచంగిపుట్టు మండలంలోని మాకవరం పంచాయతీ కేంద్రంలో తీవ్రమైన నీటి కొరత నెలకొంది. సుమారు 80 కుటుంబాల గిరిజనులు ఒకే బోరు, ఊటగెడ్డ నీటిపై ఆధారపడుతున్నాయి. వేసవి తీవ్రతతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు, ప్రభుత్వం స్పందించి మంచినీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
GNTR: భారత్నెట్, పీఎం-వాణీ పబ్లిక్ వైఫై విస్తరణపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్షించారు. సేవలను ప్రజలకు మరింత సులభంగా అందించే మార్గాలపై చర్చించారు. అమలు ప్రక్రియలు, వ్యయ నిర్మాణంపై పలు సూచనలు చేశారు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం నాణ్యమైన ఇంటర్నెట్ అందించడమే లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
VZM: విజయనగరం పట్టణంలో పోలీసులు మెగా వాహన తనిఖీలు చేపట్టారు. ఇవాళ సాయంత్రం 5 నుంచి వాహన తనిఖీలు కొనసాగుతున్నాయి. మొత్తం 200 ప్రాంతాల్లో నిర్వహించిన ఈ తనిఖీల్లో సుమారు 1000 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పత్రాలు లేని వాహనాలు సీజ్ చేయడం, హెల్మెట్ లేకుండా ప్రయాణం, మైనర్ డ్రైవింగ్, సైలెన్సర్ మార్పులపై చర్యలు తీసుకున్నారు.
కర్నూలుకు చెందిన కె. పద్మలతా రెడ్డి టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఇవాళ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. కార్పొరేటర్గా పనిచేసిన ఆమె పార్టీకి విశేష సేవలు అందించారు. కర్నూలు నుంచి మహిళగా ఈ పదవికి ఎంపిక కావడం ఇదే తొలిసారి. ఆమె నియమకం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
CTR: మహిళలు బాలికల భద్రత కోసం రూపొందించిన శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు సూచించారు. చిత్తూరు స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో మహిళల భద్రత, పిల్లల రక్షణపై శక్తి టీం ఆధ్వర్యంలో బుధవారం అవగాహన కల్పించారు. మహిళల భద్రత కోసం పోలీసు శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని ఆయన వెల్లడించారు.
కోనసీమ: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనగణన 2027 తొలి దశ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుందని మున్సిపల్ కమిషనర్, ఛార్జ్ ఆఫీసర్ టీవీ రంగారావు బుధవారం తెలిపారు. ఈసారి జనాభా లెక్కల సేకరణ పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. తమ వివరాలను స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకునే సెల్ఫ్ ఎన్యుమరేషన్ సదుపాయం కలిపించామన్నారు.
ATP: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ బుధవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో 22ఏ, భూ రీసర్వే, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, డిజిటల్ రెవెన్యూ రిజిస్ట్రీ వంటి అంశాలపై సమీక్షించారు. అనంతపురం కలెక్టరేట్ నుంచి కలెక్టర్ ఆనంద్ పాల్గొన్నారు. పాసుపుస్తకాల పంపిణీలో జాప్యం జరగకుండా చూడాలని సీఎస్ ఆదేశించారు.
KDP: జిల్లా వ్యాప్తంగా మద్యం బెల్ట్ షాపులపై విస్తృతస్థాయిలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఒకేరోజు 47 కేసు నమోదు చేసి 47 మందిని అరెస్టు చేశారు. 579 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. 554 క్వార్టర్ బాటిళ్ల మద్యం, 25 బీర్ బాటిళ్లును స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం విక్రయాలు జరిపితే చర్యలు తీసుకుంటామని ఎస్పీ విశ్వనాథ్ హెచ్చరించారు.
NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో హుండీ కానుకల లెక్కింపు కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహించారు. ఇవాళ ఉదయం 8 గంటలకు మల్లికార్జున మహామండపం 6వ అంతస్తులో ప్రారంభమైన లెక్కింపు సాయంత్రం 4 గంటలకు పూర్తయింది. ఈవో, పాలకమండలి సభ్యులు, దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో సీసీటీవీ నిఘా మధ్య లెక్కింపు జరిగిందన్నారు.
BPT: చీరాల పట్టణ ట్రాఫిక్ ఎస్సై పవన్ కుమార్, మహిళా ఎస్సై వాణిశ్రీ తమ సిబ్బందితో కలిసి వాహన తనిఖీ నిర్వహించారు. నిబంధనలు పాటిస్తూ, హెల్మెట్ ధరించిన వాహనదారులను ఎస్సై పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు. క్రమశిక్షణతో వాహనాలు నడిపే వారిని ప్రోత్సహించడం ద్వారా ఇతరులలో మార్పు వస్తుందని అధికారులు పేర్కొన్నారు.
KKD: టీడీపీ అత్యున్నత విభాగమైన పొలిట్ బ్యూరోలో ఉమ్మడి తూ.గో. జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ నేతలకు స్థానం దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూలను అధిష్ఠానం సభ్యులుగా నియమించింది. యనమల పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతుండగా, నెహ్రూ మధ్యలో పార్టీ మారినా ఆయన సీనియారిటీని గుర్తించి ఈ గౌరవం కల్పించారు
VZM: రహదారి భద్రత, నేర నియంత్రణ, గంజాయి రవాణా నియంత్రించుటకు పట్టణంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. ఈ తనిఖీల్లో వాహన పత్రాలు సక్రమంగా లేని వాహనాలను గుర్తించి, వాటిని సీజ్ చేశామన్నారు. వాహనాలు ప్రమాదాలకు గురైనపుడు సరైన ఇన్సూరెన్స్ లేకుంటే కలిగే అనర్ధాలను వాహనదారులకు వివరించి, వాహనాలకు తప్పనిసరిగా ఇన్సూరెన్సు ఉండాలని సూచించామన్నారు.
PLD: మాచర్లలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సతీమణి శోభారాణి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం జరిగిన ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఆలయ కమిటీ ఛైర్మన్ కొమెర అనంతరాములు ఆమెను సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
TPT: ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా శ్రీవారి వీఐపీ దర్శనం, వసతి కల్పిస్తామని చెప్పి భక్తులను మోసం చేసిన ఇద్దరు నిందితులను తిరుమల II టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు సోషల్ మీడియా పోస్టులతో ఆకర్షించి UPI ద్వారా డబ్బులు తీసుకుని మోసాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వివిధ రాష్ట్రాల భక్తులను కూడా ఇదే విధంగా మోసం చేసినట్లు వెల్లడైంది.
TPT: 2016 ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో నిందితుడు హరినాథ్ రెడ్డికి 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.3 లక్షల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ‘గుడ్ ట్రయల్ మానిటరింగ్’ ద్వారా ఈ విజయం సాధించామని ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఎర్రచందనం అక్రమ రవాణాపై జీరో టోలరెన్స్ కొనసాగుతుందని పోలీసులు స్పష్టం చేశారు.