NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో హుండీ కానుకల లెక్కింపు కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహించారు. ఇవాళ ఉదయం 8 గంటలకు మల్లికార్జున మహామండపం 6వ అంతస్తులో ప్రారంభమైన లెక్కింపు సాయంత్రం 4 గంటలకు పూర్తయింది. ఈవో, పాలకమండలి సభ్యులు, దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో సీసీటీవీ నిఘా మధ్య లెక్కింపు జరిగిందన్నారు.