• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

సైకిల్ తొక్కిన మంత్రి సత్యకుమార్

SS: ధర్మవరం నియోజకవర్గంలోని 10వ తరగతి విద్యార్థులకు రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ 2000 సైకిళ్లను పంపిణీ చేశారు. విద్యార్థుల చదువుకు రవాణా ఆటంకం కాకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి స్వయంగా సైకిల్ తొక్కి విద్యార్థుల్లో ఉత్సాహం నింపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

April 14, 2026 / 03:45 PM IST

అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ

AKP: పాయకరావుపేట గ్రామసభను స్థానిక పంచాయతీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో లవరాజు మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అలాగే, ఇంటి పన్నులు బకాయిలు లేకుండా చెల్లించాలన్నారు. అలాగే, అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను చక్కదిద్దాలని పలువురు నాయకులు విజ్ఞప్తి చేశారు.

April 14, 2026 / 03:44 PM IST

అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కల్పించాలి: మంత్రి

NDL: జిల్లాలో అగ్నిప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని మంత్రి ఫరూక్, కలెక్టర్ రాజకుమారి తెలిపారు. మార్కెట్ యార్డ్ ప్రాంగణంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో ఇవాళ నుంచి ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవాల్లో వారు పాల్గొన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించాలని అధికారులను కోరారు.

April 14, 2026 / 03:40 PM IST

‘విద్యతోనే అభివృద్ధి సాధ్యం’

E.G: విద్యతోనే అభివృద్ధి జరుగుతుందని దేవరపల్లి సొసైటీ ఛైర్మన్ ఉప్పులూరి నోమేంద్ర రామారావు అన్నారు. దేవరపల్లి స్థానిక దళిత వాడలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

April 14, 2026 / 03:35 PM IST

సీఐటీయూ రాష్ట్ర మహాసభలకు పిలుపు

నంద్యాలలో ఈ నెల 17 నుంచి 19 వరకు జరిగే సీఐటీయూ 17వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి టీ. శివరాం మంగళవారం పిలుపునిచ్చారు. ప్యాపిలిలో కార్యక్రమానికి సంబంధించి పోస్టర్లను ఆవిష్కరించారు. మహాసభల్లో కార్మిక సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.

April 14, 2026 / 03:35 PM IST

పేదల సంక్షేమమే ధ్యేయం: ఎమ్మెల్యే

TPT: సుళ్లూరుపేట బొగ్గుల కాలనీలో 150 దళిత, గిరిజన కుటుంబాలకు రూ.1.8 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 2KW సోలార్ రూఫ్ టాప్ యూనిట్లను ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు వీటిని పూర్తిగా ఉచితంగా అందని, దీనివల్ల ఒక్కో కుటుంబం ఏడాదికి సుమారు రూ.20 వేల వరకు విద్యుత్ ఖర్చును ఆదా చేసుకోవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. పేదల సంక్షేమమే ధ్యేయమని ఆమె పేర్కొన్నారు.

April 14, 2026 / 03:34 PM IST

అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి..!

GNTR: అమరావతిలో నందమూరి బసవతారక రామారావు క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు కానుంది. దీనిని రూ.650 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్నారు. అత్యాధునిక వసతులతో 500 పడకల సామర్థ్యంతో ఈ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురానున్నారు. దీని నిర్మాణానికి అవసరమైన పర్యావరణ అనుమతుల కోసం సంబంధిత అధికారులకు తాజాగా దరఖాస్తు చేశారు. త్వరలోనే ఈ ఆసుపత్రి పనులు ప్రారంభం కానున్నాయి.

April 14, 2026 / 03:30 PM IST

రూ.86 కోట్లతో పేదలకు సౌర విద్యుత్: ఎమ్మెల్యే

NLR: పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా కోవూరు నియోజకవర్గంలో రూ. 86 కోట్లతో సౌర విద్యుత్ సేవలు అందించనున్నట్లు MLA వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. మంగళవారం కోవూరులో సీసీ రోడ్లు, డ్రైనేజీల అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ పేదలకు 7469 సౌర యూనిట్లను ఏర్పాటు చేయనున్నామన్నారు. సోలార్ వినియోగం వల్ల గ్రీన్ ఎనర్జీ పెంపొందుతుందన్నారు.

April 14, 2026 / 03:30 PM IST

ప్రమాద భరితంగా ప్రయాణం..!

PLD: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గించాలని అధికారులు నానా ప్రయత్నాలు చేస్తుంటే, జనాలు దానిని ఏమాత్రం పట్టించుకోవడంలేదు. మండుటెండలో సకాలంలో ఇంటికి చేరాలనే ఉద్దేశంతో వ్యవసాయ కూలీలు ఓవర్ లోడ్ ప్రయాణానికి ఆసక్తి చూపుతున్నారు. ఎన్నో సందర్భాల్లో ట్రాక్టర్లు బోల్తాపడి కూలీలు మృతి చెందిన ఘటనలు ఉన్నా మారడం లేదు. ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

April 14, 2026 / 03:30 PM IST

భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు

KRNL: భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఇవాళ జిల్లాలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న విగ్రహానికి ఎస్పీ విక్రాంత్ పాటిల్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భారత రాజ్యాంగ రూపకర్తగా దేశ ప్రజాస్వామ్యానికి బలమైన పునాదులు వేశారన్నారు.

April 14, 2026 / 03:25 PM IST

భీమవరంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

W.G: భారతదేశ చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేరు డాక్టర్ భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్ అని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా భీమవరం అంబేద్కర్ సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే అంజిబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు.

April 14, 2026 / 03:24 PM IST

24 గంటల్లో 47 కేసులు , 47 మంది అరెస్టు

KDP: జిల్లాలో అక్రమ మద్యం విక్రయాలపై పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. గత 24 గంటల్లో 47 కేసులు నమోదు చేసి 47 మందిని అరెస్టు చేశారు. సుమారు రూ.1.20 లక్షల విలువైన 554 క్వార్టర్ బాటిళ్లు, 25 బీర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు.

April 14, 2026 / 03:21 PM IST

బొల్లవరంలో గ్రామసభ నిర్వహణ

PLD: ముప్పాళ్ల మండలం బొల్లవరం గ్రామంలో మంగళవారం గ్రామ సభ ఘనంగా నిర్వహించారు. తాగునీరు, పారిశుధ్యం, రహదారుల అభివృద్ధి, పథకాల అమలు వంటి అంశాలపై చర్చించారు. ప్రజల సమస్యలను విని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పీ.రత్నం, ఎంపీపీ వీర భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

April 14, 2026 / 03:20 PM IST

చలివేంద్రంను ప్రారంభించిన ఎమ్మెల్యే

NTR: నందిగామ పట్టణం అనాసాగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన డొక్కా సీతమ్మ చలివేంద్రంను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమాజ హితం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. ప్రయాణికులు, సామాన్య ప్రజలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఇలాంటి చలివేంద్రాలు వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీరుస్తాయని తెలిపారు.

April 14, 2026 / 03:20 PM IST

అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ

నంద్యాల పట్టణంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో వైసీపీ ఎమ్మెల్సీ ఇషాక్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

April 14, 2026 / 03:19 PM IST