PLD: ముప్పాళ్ల మండలం బొల్లవరం గ్రామంలో మంగళవారం గ్రామ సభ ఘనంగా నిర్వహించారు. తాగునీరు, పారిశుధ్యం, రహదారుల అభివృద్ధి, పథకాల అమలు వంటి అంశాలపై చర్చించారు. ప్రజల సమస్యలను విని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పీ.రత్నం, ఎంపీపీ వీర భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.