KDP: ప్రొద్దుటూరు లింగాపురంలో సహజీవనం సాగిస్తున్న రామాంజనేయులు, ప్రమీల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రమీల మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు భర్త ఐజాక్, ఇటు బంధువులు రాలేదు. పోలీసులు సమాచారమిచ్చినా ఎవరూ స్పందించకపోవడంతో ఆమె మృతదేహం ప్రొద్దుటూరు ఆసుపత్రి మార్చురీలోనే ఉంచారు. మున్సిపాలిటీ, స్వచ్ఛంద సంస్థల దహన సంస్కారాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
NDL: బనగానపల్లె నియోజకవర్గం అవుకుమెట్ట ప్రాంతంలో ఇళ్ల పట్టాల పంపిణీ కోసం నిర్ణయించిన భూములను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. భూమి చదును, జంగిల్ క్లియరెన్స్ పనులను పర్యవేక్షించిన ఆయన, అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. లోతట్టు ప్రాంతాలను కూడా పూర్తిగా చదును చేయాలని ఆదేశించారు.
ELR: కలిదిండి మండలంలో ఈనెల 14న అంబేడ్కర్ జయంతి వేడుకల భద్రతపై సీఐ రవికుమార్ ఆదివారం రాత్రి ఉత్సవ కమిటీలతో సమావేశమయ్యారు. విగ్రహాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. డీజేలకు అనుమతి లేదని, కార్యక్రమాలకు పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా వేడుకలు జరుపుకోవాలని వెల్లడించారు.
కోనసీమ: నేడు అమలాపురం ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు పర్యటన వివరాలు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. నేటి మధ్యాహ్నం 3 గంటలకు అమలాపురం పంచాయతీరాజ్ అతిధి గృహం నందు పంచాయతీ రాజ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొంటారు అని తెలిపారు. కూటమి నాయకులు ఈ కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో పాల్గొనాలని పేర్కొన్నారు.
పల్నాడు: శావల్యాపురం మండలం పొట్లూరులోని ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం వద్ద ఆదివారం తిరుణాల వేడుకలను భక్తులు వైభవంగా నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని అర్చనలు, అభిషేకాలు, కుంకుమ పూజలతో మొక్కులు తీర్చుకున్నారు. విద్యుత్ ప్రభలు నిర్మించి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
W.G: నిబంధనలు పాటించడం బాధ్యత మాత్రమే కాదని, అది వాహనదారుల భద్రత కూడా అని నరసాపురం టౌన్ ఎస్సై సీహెచ్ జయలక్ష్మి అన్నారు. ఆదివారం నరసాపురం పట్టణంలోని వాహన తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్ లేకపోవడం, అతివేగం, మొబైల్ డ్రైవింగ్, నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానా విధించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు, జరిమానాలు తప్పవని ఎస్సై తెలిపారు.
గుంటూరులో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫెస్టివల్లో తెనాలి ఎన్సీఆర్ఎం హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ చూపారు. 7, 8 తరగతుల విద్యార్థులు భావన, పార్ధు, జాస్మిన్, రామకృష్ణ, రమ్య చిత్రలేఖనంలో బంగారు, వెండి పతకాలు గెలుచుకున్నారు. వీరికి హైకోర్టు న్యాయమూర్తి గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ప్రశంసాపత్రాలు అందజేశారు. విద్యార్థుల ప్రతిభపై ప్రముఖులు ప్రశంసలు కురిపించారు.
PLD: నరసరావుపేట పట్టణం బరంపేటలో ఆదివారం శ్రీకృష్ణదేవరాయలు, వంగవీటి మోహనరంగా విగ్రహాలను ఘనంగా ఆవిష్కరించారు. తెలుగు సామ్రాజ్య వైభవాన్ని చాటిన శ్రీకృష్ణదేవరాయలు స్ఫూర్తిదాయకుడని, ప్రజల కోసం పోరాడిన నేతగా వంగవీటి మోహనరంగా గుర్తుండిపోతారని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
CTR: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం నిత్య అన్నదానం ట్రస్ట్కు హైదరాబాద్కు చెందిన శరణ్ కుటుంబ సభ్యులు రూ.1,00,116 విరాళం అందించారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వీరికి మూషిక మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటం అందజేశారు.
KDP: దువ్వూరు గ్రామ సచివాలయం-1లో ఇవాళ గ్రామ సభ ఏర్పాటు చేయనున్నట్లు తహసీల్దార్ సంజీవ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుందని, రైతులందరూ గ్రామ సభకు హాజరుకావాలని ఆయన కోరారు. రీ సర్వే 5వ విడత బుధవారం నుంచి మొదలవుతుందని తహశీల్దార్ తెలిపారు.
ఎన్టీఆర్: ఇంట్లో పని చేసే పనిమనుషులను నియమించుకునే ముందు వారి పూర్తి వివరాలు సేకరించడం అత్యంత అవసరమని సెంట్రల్ ఏసీపీ దామోదర్ సూచించారు. ఇటీవల నగరంలో జరుగుతున్న చోరీలు, మోసాల నేపథ్యంలో ఈ సూచనలు చేసినట్లు తెలిపారు. పనిమనుషులను పని కోసం తీసుకునే ముందు వారి ఆధార్, చిరునామా, ఫోన్ నంబర్ వంటి వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని చెప్పారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో పోలీస్ అధికారులు ప్రత్యేక డ్రంక్ & డ్రైవ్ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 42 మందిపై కేసులు నమోదు చేశారు. మైనర్లు వాహనాలు నడపడం నేరమని, వారికి వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులపైనే చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి హెచ్చరించారు. మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే రూ. 10 వేల జరిమానా, జైలు శిక్ష విధించబడుతుంది అన్నారు.
KKD: అంబేద్కర్ జయంతిని మద్యపాన నిషేధ దినంగా ప్రకటించాలని మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ, అంబేద్కర్ యువజన సంఘాలు డిమాండ్ చేశాయి. ఆదివారం సాయంత్రం గొల్లప్రోలు పట్టణంలోని ఎస్సీ పేటలో అంబేద్కర్ విగ్రహం వద్ద పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మద్యం కారణంగా అనేక కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు.
ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదివారపు పేటలోని ఓ ఇంట్లో పేకాట నిర్వహిస్తున్న సమాచారంతో సీఐ అశోక్ కుమార్ తన సిబ్బందితో కలిసి ఆదివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఎనిమిది మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిలో నలుగురు మహిళలు ఉన్నారని పేర్కొన్నారు. రూ.10వేల నగదు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
సత్యసాయి: అగళి మండలం ఇరిగేపల్లి పంచాయతీ వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి సమక్షంలో పంచాయతీ అధ్యక్షుడు ప్రకాష్ యాదవ్, గురులింగప్ప, లక్ష్మీకాంత, చిక్కన్న వైసీపీకి రాజీనామా చేసి పసుపు కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి డి.విశ్వనాధ్ యాదవ్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.