• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కాకినాడలో భారీగా రేషన్ బియ్యం సీజ్

కాకినాడ జిల్లా పోర్టుతో పాటు పలు గోడౌన్‌లలో పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ తోట సుధీర్, డీఎస్‌వో సత్యనారాయణ రాజు బృందం బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. కొన్ని మిల్లుల్లోని బియ్యంలో పీడీఎస్ బియ్యానికి సంబంధించిన కెర్నాల్స్‌ను అధికారులు గుర్తించారు. దీంతో 910 టన్నుల బాయిల్డ్ బియ్యం, రవాణాకు సిద్ధంగా ఉన్న 10 లారీలను సీజ్ చేశారు.

April 16, 2026 / 08:14 AM IST

కొయ్యూరు ఏకలవ్య మోడల్ పాఠశాలలో 100 శాతం ఉత్తీర్ణత

అల్లూరి: కొయ్యూరు మండలం బాలారం ఏకలవ్య మోడల్ పాఠశాలలో 10వ తరగతి పరీక్షల్లో (సీబీఎస్ఈ) 100 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపాల్ డాక్టర్ సతీష్ కుమార్ బుధవారం తెలిపారు. 30 మంది బాలురు, 30 మంది బాలికలు మొత్తం 60 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారన్నారు. నంద కిషోర్ 446/500, బద్రి 442/500 పాఠశాలలో మొదటి, ద్వితీయ స్థానాల్లో నిలిచారని తెలిపారు.

April 16, 2026 / 08:13 AM IST

అత్యాచారం కేసులో నిందితుడి అరెస్టు

సత్యసాయి: వివాహితపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు బిల్లా కుమార్‌ను కనగానపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ముత్తవకుంట్ల ఎస్సీ కాలనీకి చెందిన ఇతడు, ఈ నెల 14న ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఎస్సై మహమ్మద్ రిజ్వాన్, నిందితుడిని పట్టుకుని రిమాండ్‌కు తరలించారు.

April 16, 2026 / 08:10 AM IST

గంజాయి కేసులో నిందితుడికి శిక్ష

అనకాపల్లి: గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడికి 4 ఏళ్ల 9 నెలల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధిస్తూ విశాఖ 1వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది. 2021లో నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో ఆకాశ్ పాండురంగన్ (A3)పై నేరం రుజువుకావడంతో శిక్ష ఖరారైనట్లు ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు.

April 16, 2026 / 08:06 AM IST

గురువారం: నేటి తిరుమల సమాచారం

TPT: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోయి, బయట ATGH వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న మొత్తం 77,077 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా, 27,241 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.47 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

April 16, 2026 / 08:00 AM IST

‘టెన్త్ జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి’

E.G: బివిఎమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో గత 9 రోజులుగా జరిగిన పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రశాంతంగా ముగిసిందని డీఈవో కంది వాసుదేవరావు బుధవారం తెలిపారు. 7 జిల్లాల నుంచి 7 సబ్జెక్టులకు సంబంధించిన 1,76,032 పత్రాలు వచ్చాయి. 780 మంది సిబ్బంది విధుల్లో పాల్గొన్నారన్నారు. ఇందులో 75 చీఫ్ ఎగ్జామినర్లు, 455 అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 221 సహాయకులు విధులు నిర్వహించినట్లు వెల్లడించారు.

April 16, 2026 / 08:00 AM IST

‘లోకేష్ నియామకం పార్టీకి వెయ్యి ఏనుగుల బలం’

కోనసీమ: రాష్ట్ర విద్యా శాఖామంత్రి నారా లోకేష్ బాబుకు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించడం టీడీపీ కేడర్‌లో వెయ్యి ఏనుగుల బలాన్ని నింపడమేనని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్,  మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు బుధవారం రాత్రి అన్నారు. లోకేష్‌కు పార్టీలో నూతన బాధ్యత అప్పగించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. నారా లోకేష్‌కు అభినందనలు తెలియజేశారు.

April 16, 2026 / 08:00 AM IST

రోడ్డు ప్రమాదంపై మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోణ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి టీజీ భరత్ గురువారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దర్శనానికి వెళ్తున్న సమయంలో జరిగిన ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని మంత్రి పేర్కొన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

April 16, 2026 / 07:57 AM IST

తెనాలి సమీపంలో రైలు ఢీకొని వ్యక్తి మృతి

GNTR: తెనాలి నిత్యం రైలు రాకపోకలతో రద్దీగా ఉండే విజయవాడ-చెన్నై రైలు మార్గంలోని మోదుకూరు రైల్వే స్టేషన్లో సుమారు 50 ఏళ్ల వయసున్న వ్యక్తి రైలు ఢీకొట్టడంతో ప్లాట్ఫాంపై పడి మృతి చెందాడు. ఆచూకీ తెలిసిన వారు తెనాలి జీఆర్పీ పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ ఘటనపై జీఆర్పీ ఎస్సై సరస్వతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 16, 2026 / 07:54 AM IST

పీజీఆర్‌ఎస్‌ వేళల్లో మార్పు: కలెక్టర్

ATP: ఎండల తీవ్రత దృష్ట్యా ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) వేళల్లో మార్పులు చేశారు. ఈ మార్పులు ఈ నెల 20 నుంచి అమలులోకి రానున్నాయి. దీని ప్రకారం ఉ.8 నుంచి11 వరకు అర్జీలు స్వీకరిస్తారు. కలెక్టరేట్‌తో పాటు ఆర్డీఓ, తహసీల్దార్‌ కార్యాలయాలు, గ్రామ సచివాలయాల్లోనూ ఇదే సమయం వర్తిస్తుందని కలెక్టర్‌ ఆనంద్‌ తెలిపారు.

April 16, 2026 / 07:53 AM IST

రేషన్ దుకాణాలను తనిఖీ చేసిన కన్నబాబు

ELR: రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమీషనర్ కె. కన్నబాబు ఏలూరు (D)లో పర్యటించారు. భీమడోలు (M) సూరప్పగూడెంలోని రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి సేవలపై ఆరా తీశారు. అనంతరం పాతూరులోని చౌక ధరల దుకాణాన్ని తనిఖీ చేశారు. లబ్ధిదారులకు సరుకులు సక్రమంగా అందుతున్నాయా లేదా అని పరిశీలించారు. నిబంధనల ప్రకారం పంపిణీ జరగాలని అధికారులను ఆదేశించారు.

April 16, 2026 / 07:52 AM IST

‘విజిబుల్ పోలీసింగ్‌ను విస్తృతంగా అమలు చేస్తున్నాం’

NDL: జిల్లాలో నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం విజిబుల్ పోలీసింగ్‌ను విస్తృతంగా అమలు చేస్తున్నట్లు ఎస్పీ సునీల్ షౌరాణ్ బుధవారం తెలిపారు. జిల్లావ్యాప్తంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ.. అనుమానాస్పద వాహనాలు, నిషేధిత వస్తువుల రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తూ, హెల్మెట్, సీటు బెల్ట్ వినియోగం గురించి వివరించారు.

April 16, 2026 / 07:51 AM IST

మడకశిర విద్యుత్ డీఈఈ రఘు సస్పెన్షన్

సత్యసాయి: అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో మడకశిర సబ్ డివిజన్ విద్యుత్ డీఈఈ రఘును సస్పెండ్ చేస్తూ ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ ఉత్తర్వులు ఇచ్చారు. నిబంధనల అతిక్రమణ, రైతులకు సామగ్రి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడం, అనధికారికంగా విద్యుత్ లైన్లు మార్చడం వంటి ఆరోపణలు ఆయనపై వచ్చాయి. వీటిపై విచారణ జరిపించిన అధికారులు అక్రమాలు జరిగినట్లు నిర్ధారించారు. 

April 16, 2026 / 07:48 AM IST

గన్నవరం అభివృద్ధిపై సమీక్ష

కృష్ణా: గన్నవరం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్ రావు తెలిపారు. బుధవారం నిర్వహించిన సమీక్షలో రూ.25 కోట్లతో గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి ప్రతిపాదనలను పరిశీలించారు. రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. నిర్లక్ష్యం సహించబోమని ఆయన హెచ్చరించారు.

April 16, 2026 / 07:47 AM IST

భూగర్భ జలాల మట్టాలను పెంచేందుకు కృషి: కలెక్టర్

మన్యం: జిల్లాలోని నీటి వనరులను శాశ్వత ప్రాతిపాదికన సంరక్షించేందుకు, భూగర్భ జలాల మట్టాలను పెంచేందుకు అత్యధిక సాకేంతికతో కూడిన మ్యాపింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు కలెక్టర్ డా. ప్రభాకరరెడ్డి ప్రధాన కార్యదర్శికి వివరించారు. అమరావతి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బుధవారం రీ సర్వే, జలధార తదితర అంశాలపై కలెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

April 16, 2026 / 07:43 AM IST