TPT: పిచ్చాటూరు ఐసీడీఎస్ ప్రాజెక్ట్లో అంగన్వాడి కార్యకర్త-1, హెల్పర్- 9 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏప్రిల్ 6 నుంచి 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అర్హతలు కలిగిన స్థానిక మహిళలు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. పదవ తరగతి ఉత్తీర్ణతతో పాటు 21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలన్నారు. స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారన్నారు.
CTR: పుంగనూరు నగిరి వీధిలో వెలసిన శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత సోమేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు శనివారం సాయంత్రం వైభవంగా ముగిశాయి. 11 రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాల్లో ఒక్కోరోజు ఒక్కొక్క వాహనంపై పార్వతీ పరమేశ్వరులు పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమాలకు సహకరించినవారికి కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.
NTR: నందిగామలోకృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీ గోపి, న్యాయ సేవాధికారి రామకృష్ణ కోర్టు ప్రాంగణం, సబ్ జైలు పర్యటించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ కరీముల్లా, కార్యదర్శి చెరుకుమల్లి రామారావు నేతృత్వంలో ఘన స్వాగతం పలికారు. బార్ ఛాంబర్లో సమస్యలు వివరించగా పరిష్కరిస్తానని జడ్జి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
BPT: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 9 పర్యటించనున్న నేపథ్యంలో జిల్లాలో ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. శనివారం జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ అధికారులతో కలిసి భట్టిప్రోలు, కొల్లూరు మండలాల్లో పర్యటించారు. సభ వేదిక, హెలిప్యాడ్ ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను పరిశీలించి, భద్రతా ఏర్పాట్లపై సూచనలు చేశారు.
TPT: పేరూరు చెరువు నుంచి అవిలాల చెరువు వరకు సప్లై ఛానల్కు సంబంధించిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ పనులకు రూ. 8 కోట్ల అంచనాతో టెండర్లు పిలిచి, అవిలాల చెరువు సుందరీకరణతో పాటు మౌలిక వసతుల అభివృద్ధి చేపట్టాలని అధికారులకు సూచించారు.
SKLM: సింగుపురంలో బాదం పాలు తాగి 80 అస్వస్థతకు గురైన ఘటనపై జిల్లా ఇంఛార్జ్ మంత్రి శ్రీనివాస్ స్పందించారు. శనివారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్తో ఫోన్లో మాట్లాడారు. బాధితులకు అందుతున్న వైద్యం గురించి మంత్రి ఆరాతీశారు. బాధితులు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ను ఆదేశించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ASR: గిరిజన యువతి దూసరి లక్ష్మి ఆత్మహత్య ఘటనపై అనంతగిరి మండలంలో కోరపర్తిలో గ్రామస్తులు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రేమ పేరుతో మోసం చేసిన కొల్లి లోకేష్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, ఎక్స్గ్రేషియా, ఉద్యోగం కల్పించాలని కోరారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి నిందితుడిని శిక్షించాలని కోరారు.
GNTR: రమేష్ ఆసుపత్రి వైద్యులు అరుదైన ఘనత సాధించారు. 64 ఏళ్ల రోగికి మత్తు ఇవ్వకుండా మెలకువలోనే గుండె బైపాస్ ఆపరేషన్ చేశారు. గతంలో క్యాన్సర్ చికిత్సల వల్ల సదరు రోగి ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. సాధారణ మత్తు ఇస్తే ప్రాణాపాయం ఉంటుందని వైద్యులు భావించారు. దీంతో డాక్టర్ల బృందం వెంటిలేటర్ అవసరం లేకుండానే ఈ సర్జరీని పూర్తి చేశారు.
ప్రకాశం: ఇటీవల మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన వెలిగండ్ల మండలం చోడవరం గ్రామానికి చెందిన పొదిలి మహేంద్ర కుటుంబాన్ని వైసీపీ ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ శుక్రవారం పరామర్శించారు. జిల్లా వైసీపీ అధ్యక్షులు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రకటించిన రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని మహేంద్ర భార్య నాగమణికి అందజేశారు.
NDL: డోన్ మండలం చిన్న మల్కాపురం సమీపంలో ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారి నిర్మాణ పనుల కోసం వేసిన కంకర కారణంగా ఈ ఘటన చోటుచేసుకుంది. బైక్పై వెళ్తున్న ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులు కంకరపై వాహనం జారి కిందపడ్డారు. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికులు గుర్తించి వెంటనే డోన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు సమాచారం.
ELR: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని, టి.నర్సాపురం ఎస్సై జయబాబు విగ్రహ కమిటీ సభ్యులకు, యువతకు పలు కీలక సూచనలు చేశారు. మహనీయుని జయంతి వేడుకలను అత్యంత క్రమశిక్షణతో, భక్తిశ్రద్ధలతో మరియు ఘనంగా నిర్వహించు కోవాలని కోరారు. ప్రతి విగ్రహం వద్ద తప్పనిసరిగా తగినంత లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు.
KRNL: కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని RDO కార్యాలయంలో నిర్వహించిన ఏపీ బడ్జెట్ 2026-27 ఔట్రీచ్ కార్యక్రమంలో MLA దస్తగిరి పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతులు, మహిళలు, యువత అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకొని రూపొందించబడిందని తెలిపారు. మొత్తం రూ.3.32 లక్షల కోట్ల బడ్జెట్లో కోడుమూరు నియోజకవర్గానికి రూ.362 కోట్లు కేటాయించారని తెలిపారు.
KDP: జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు 12 నెలల పూర్తి వేతనం చెల్లించాలని DYFI జిల్లా కార్యదర్శి శివ డిమాండ్ చేశారు. యాజమాన్యాలు తల్లిదండ్రుల నుంచి 12 నెలల ఫీజులు వసూలు చేస్తూ, టీచర్లకు మాత్రం 10 నెలల జీతం మాత్రమే ఇవ్వడం అన్యాయమని విమర్శించారు. వేసవిలో జీతం లేక టీచర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
W.G: ఆకివీడులో ఎటువంటి ఆందోళనలకు అనుమతి లేదని భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆకివీడులో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నాయని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను నమ్మవద్దని ఆయన కోరారు.
NLR: నెల్లూరుకు చెందిన ప్రముఖ వైద్యురాలు అంబటి హేమలత రెడ్డి పవర్ లిఫ్టింగ్లో గోల్డ్ మెడల్ సాధించారు. విజయనగరం జిల్లా రాజాంలో శనివారం జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో 63 కేజీల మాస్టర్స్ కేటగిరీలో ఆమె విజయం అందుకున్నారు. హేమలత రెడ్డి ప్రస్తుతం న్యూరో వైద్యురాలిగా నిర్వహిస్తుండగా.. ఆమె భర్త పీహెచ్సీ వైద్యాధికారిగా పనిచేస్తున్నారు.