• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే‌ విజయ్ చంద్రకు గిరిజనుల కృతజ్ఞతలు

PPM: పార్వతీపురం మండలంలో గిరిజన ప్రాంతాలకు రోడ్లు మంజూరు చేసిన ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్రకు ఆ ప్రాంత గిరిజనులు కృతజ్ఞతలు తెలియజేశారు. శనివారం పార్వతీపురంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసిన గిరిజన నాయకులు, ఆయనను శాలువాతో సత్కరించి పూలమాలలు వేసి కృతజ్ఞతాభివందనాలు తెలియజేశారు. ఎమ్మెల్యే చొరవతో రోడ్డుకల సహకారం అయింది అన్నారు.

February 21, 2026 / 02:15 PM IST

ఏసీబీ దాడుల్లో చిక్కిన వ్యక్తి కోర్టుకు తరలింపు

ప్రకాశం: కంభంలో శుక్రవారం వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. తురిమెళ్ల గ్రామానికి చెందిన ఎరువుల దుకాణదారుడు రవీంద్ర కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో రూ. 20 వేలు లంచం తీసుకుటుండగా వ్యవసాయ అధికారి మహమ్మద్‌ను పట్టుకున్నారు. అతని ఇంట్లో శనివారం తెల్లవారుజాము వరకు సోదాలు నిర్వహించారు. అనంతరం ఆయనను నెల్లూరు కోర్టుకు తరలించారు.

February 21, 2026 / 02:14 PM IST

వంగలపూడిలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిక

E.G: రుడా ఛైర్మన్, తూ.గో జిల్లా TDP అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి సమక్షంలో సీతానగరం మండలం వంగలపూడికి చెందిన పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ కాండ్రేగుల ఫణిబాబు శనివారం YCPకి రాజీనామా చేసి TDPలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు వెంకటరమణ చౌదరి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఫణిబాబు చేరికతో వంగలపూడిలో TDP మరింత బలోపేతం అవుతుందని అన్నారు.

February 21, 2026 / 02:12 PM IST

పథకాలు అమలులో నిర్లక్ష్యం వద్దు: ఎమ్మెల్యే బత్తుల

E.G: విధుల నిర్వహణ విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తెలిపారు. DRDA – సెర్ప్ శాఖ అమలు చేస్తున్న పథకాలు అమలుపై శనివారం రాజానగరంలో ఆయన సమీక్షి నిర్వహించారు. ఫీల్డ్ సిబ్బంది పై తరచూ పిర్యాదులు వస్తున్నాయని అలా రాకుండా చూసుకోవాలి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకుని రావాలన్నారు.

February 21, 2026 / 02:08 PM IST

‘వాహనదారులు హెల్మెట్ ధరించి ప్రాణ రక్షణ పొందాలి’

ELR: వాహనదారులు హెల్మెట్ ధరించి ప్రాణ రక్షణ పొందాలని చేబ్రోలు ఎస్సై సూర్య భగవాన్ అన్నారు. శనివారం ఉంగుటూరు టోల్గేట్ వద్ద చేబ్రోలు పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. హెల్మెట్లు ధరించినవారికి జరిమానాలను విధించకుండా, వాహన దారులతో హెల్మెట్లను కొనుగోలు చేయించారు. హెల్మెట్ పై వాహనదారులకు అవగాహన కల్పించారు.

February 21, 2026 / 02:05 PM IST

స్వయంగా చెత్తను ఊడ్చిన డిప్యూటీ స్పీకర్

W.G: ఆకివీడు మండలం దుంపగడపలో శనివారం ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణ రాజు, కలెక్టర్ నాగరాణి పర్యటించారు. గ్రామంలో స్వచ్ఛ రథాన్ని ప్రారంభించి, స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వయంగా రహదారిని శుభ్రం చేసి చెత్తను తొలగించారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని కోరారు. అనంతరం వర్మీ కంపోస్ట్ ఎరువు విక్రయాలను ప్రారంభించారు.

February 21, 2026 / 02:03 PM IST

శిథిలావస్థలో ఐసీడీఎస్ కార్యాలయం.. ప్రాణభయంతో సిబ్బంది

ASR: రాజవొమ్మంగి ఐసీడీఎస్ కార్యాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భవనంపైకప్పు పెచ్చులు ఊడిపడుతుండటంతో నెలవారీ సమావేశాల నిర్వహణ వారికి ప్రాణసంకటంగా మారింది. ఏదైనా పెను ప్రమాదం జరక్కముందే ఉన్నతాధికారులు స్పందించి, కార్యాలయానికి వెంటనే నూతన భవనాన్ని కేటాయించాలని సిబ్బంది కోరుతున్నారు.

February 21, 2026 / 02:03 PM IST

జనార్దన్‌కు ఎలక్ట్రిక్ త్రీ వీలర్ స్కూటర్ అందజేత

రామాపురం మండలం కల్పనాయుని చెరువు గ్రామానికి చెందిన వైఎస్ఆర్‌సిపి సీనియర్ కార్యకర్త జనార్దన్‌కు రూ.లక్షకు పైగా విలువ చేసే ఎలక్ట్రిక్ మూడు చక్రాల స్కూటర్‌ను ఎంపీ మిథున్ రెడ్డి సహకారంతో మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అందజేశారు. ప్రమాదంలో కాలు కోల్పోయిన జనార్దన్‌కు నేతలు అండగా నిలిచి ధైర్యం చెప్పారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకలు పాల్గున్నారు.

February 21, 2026 / 02:01 PM IST

రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

GNTR: ఫిరంగిపురం గ్రామ శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వేములూరిపాడుకు చెందిన నాగరాజు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బైక్‌పై వెళ్తున్న అతడిని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. తలకు బలమైన గాయం కావడంతో స్థానికులు 108 ద్వారా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం తర్వాత ఆపకుండా వెళ్తున్న లారీని స్థానికులు వెంబడించి పట్టుకున్నారు.

February 21, 2026 / 02:01 PM IST

‘ప్రతి యువకుడు రక్తదానానికి ముందుకు రావాలి’

SKLM: ఆమదాలవలసలోని ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలో శనివారం NSS ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సాంకేతిక విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎం.ఏ.వి. రామకృష్ణ ఈ శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదానం మహాదానం అని, ప్రతి యువకుడు సమాజానికి అవసరమైనప్పుడు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని ఆయన అన్నారు.

February 21, 2026 / 02:01 PM IST

అంబేడ్కర్ సర్కిల్లో స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర

KRNL: ఆలూరు అంబేడ్కర్ సర్కిల్లో శనివారం స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం జరిగింది. టీడీపీ ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతి పాల్గొని పరిసరాల పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరించారు. స్వచ్ఛమైన గ్రామాలు, పట్టణాలే ఆరోగ్యకర సమాజానికి పునాది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పారిశుధ్య కార్మికులు, ప్రజలు పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు.

February 21, 2026 / 02:01 PM IST

పరిశుభ్రతే ప్రగతికి సోపానం: ఏఆర్ అదనపు ఎస్పీ

KDP: శనివారం కడప పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఆర్ అదనపు ఎస్పీ బి. రమణయ్య మాట్లాడుతూ.. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడమే ఆరోగ్యకర సమాజానికి పునాది అని నొక్కి చెప్పారు. అనంతరం పోలీసు సిబ్బందితో స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎ, ఆర్ఎస్ఐ, ఇతర ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.

February 21, 2026 / 02:01 PM IST

ఎల్లారమ్మ జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు: DM

VZM: జామి ఎల్లారమ్మ తీర్ధ యాత్రి నేపథ్యంలో ఈనెల 24 నుంచి 8 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఎస్‌.కోట RTC DM కే.సుదర్శనరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఈ బస్సులను సాధారణ పల్లె వెలుగు ఛార్జీలతో నడపనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రత్యేక బస్సులను కొత్తవలస-జామి, జామి-కొత్తవలసకు ఉదయం 5:30 గంటలు నుంచి నడపనున్నట్లు పేర్కొన్నారు.

February 21, 2026 / 02:00 PM IST

నేర సమీక్ష సమావేశం నిర్వహించిన సీఐ

ప్రకాశం: వై.పాలెం సర్కిల్ కార్యాలయంలో సీఐ ఆధ్వర్యంలో శనివారం నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్కిల్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల ప్రగతిని గురించి సీఐ సమీక్షించారు. ముఖ్యంగా సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఎస్సైలు పాల్గొన్నారు.

February 21, 2026 / 01:49 PM IST

హిందువులు మనోభావాలను దెబ్బతీయటమే వైసిపి లక్ష్యం

PPM: రాష్ట్రంలో హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా కనిపిస్తోందని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ఆక్షేపించారు. పార్వతీపురం టీడీపీ కార్యాలయంలో కూటమి నాయకులతో కలసి మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నాయకుల వైఖరి పై నిప్పులు చెరిగారు. శుక్రవారం మండలిలో ఆ పార్టీ ఎమ్మెల్సీలు వ్యవహరించిన తీరును రాష్ట్ర ప్రజలందరూ చీత్కరిస్తున్నారని అన్నారు.

February 21, 2026 / 01:42 PM IST