• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

శాన్విరా ఇండస్ట్రీ లిమిటెడ్ గోడౌన్‌ సీజ్

VSP: యెద్దుల వెంకటరమణ రెడ్డికి చెందిన శాన్విరా ఇండస్ట్రీ లిమిటెడ్ గోడౌన్‌ను అధికారులు సీజ్ చేశారు. జీవీఎంసీకి సుమారు రూ.1.90 కోట్లు ఆస్తి పన్ను బకాయి ఉన్నట్లు గుర్తించిన అధికారులు ముందుగా నోటీసులు జారీ చేశారు. అయితే సంబంధిత సంస్థ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో శనివారం రెవెన్యూ అధికారి రామ్ నారాయణ ఆధ్వర్యంలో ఆచ్ఐలు శివ, రెడ్డి మోహన్ పాల్గొన్నారు.

February 21, 2026 / 02:36 PM IST

స్వచ్ఛ రథాన్ని ప్రారంభించిన చల్లా బాబు

CTR: రొంపిచర్ల మండలం బొమ్మయ్యగారి పల్లెలో స్వచ్ఛ రథాన్ని పుంగనూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ చల్లా బాబు రెడ్డి ప్రారంభించారు. తడి చెత్త, పొడి చెత్త సేకరించిన వాహనాన్ని డంపింగ్ యార్డ్ వరకు నడిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామని అందరి చేత ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో ఎంపీడీవో మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర కురబ కార్పొరేషన్ డైరెక్టర్ ఉయ్యాల రమణ పాల్గొన్నారు.

February 21, 2026 / 02:35 PM IST

పోలీస్ కార్యాలయాల్లో ‘స్వర్ణాంధ్ర –స్వచ్ఛ దివస్’

అన్నమయ్య జిల్లాలో శనివారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు. సీఎం చంద్రబాబు పిలుపు మేరకు జిల్లా ఎస్పీ ధీరజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అమలు చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లు, కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది శ్రమదానంలో పాల్గొని ప్రాంగణాలను శుభ్రం చేశారు.

February 21, 2026 / 02:34 PM IST

మందకృష్ణపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

కోనసీమ: భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగపై చర్యలు తీసుకోవాలని సఖినేటిపల్లి మండలం ఎస్సీ వెల్ఫేర్ సభ్యులు శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో ఎస్సై దుర్గా శ్రీనివాస్‌కు ఎస్సీ వెల్ఫేర్ అధ్యక్షుడు ప్రతాప్ పిర్యాదు చేశారు. మందకృష్ణపై వెంటనే కేసు నమోదు చేయాలని కోరారు.

February 21, 2026 / 02:34 PM IST

వ్యర్థ నిర్వహణ ప్లాంట్‌ను పరిశీలించిన కలెక్టర్

TPT: స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతి రూరల్ మండలం పెరుమాళ్లపల్లె లోని వ్యర్థ నిర్వహణ ప్లాంట్‌ను శనివారం జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్లాంట్ పనితీరును పరిశీలించి, వ్యర్థాల వేరు వేరు సేకరణ, శుభ్రత పరిరక్షణపై అధికారులకు సూచనలు చేశారు. స్థానిక ప్రజలకు వ్యర్థాల వర్గీకరణ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.

February 21, 2026 / 02:34 PM IST

టెక్నాలజీతో నేరాలకు చెక్: ఐజీ అశోక్ కుమార్

WG: పోలీస్ శాఖలో సిబ్బంది కొరత ఉన్నా సాంకేతికతతో అధిగమిస్తున్నామని ఏలూరు రేంజ్ ఐజీ జివిజీ అశోక్ కుమార్ తెలిపారు. శనివారం అచంటలో ఆయన మాట్లాడారు. నేరాల దర్యాప్తులో సీసీ కెమెరాలు, ఏఐ కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. జిల్లాలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని, డ్రంక్ అండ్ డ్రైవ్, బైక్ చోరీలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు.

February 21, 2026 / 02:34 PM IST

మేరికపూడిలో పొలంబడి కార్యక్రమం

GNTR: ఫిరంగిపురం మండలంలోని మేరికపూడి గ్రామంలో శనివారం పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి వాసంతి పాల్గొని రైతులకు పంట పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఎంపిక చేసిన 30 మంది రైతులకు శనగ పంటలో కనిపించే ఎండు తెగులు, వివిధ చీడపీడల నివారణ చర్యలు, పోషక యాజమాన్యంపై సూచనలు చేశారు.

February 21, 2026 / 02:33 PM IST

కరెంటు షాక్‌తో అడవిపంది మృతి

KDP: మైదుకూరు మండలం గంజిగుంట ఫారెస్ట్ పరిధిలో విద్యుత్ షాక్‌తో అడవిపంది శనివారం మృతి చెందింది. ఫారెస్ట్ ఆఫీసర్ చలపతి నాయుడు ఘటనా స్థలాన్ని పరిశీలించగా, పంది కాళ్లు, మాంసం లభ్యమయ్యాయి. కరెంటు తీగలు అమర్చిన పొలం యజమానిని అధికారులు విచారిస్తున్నారు. రైతులు పొలాల వద్ద విద్యుత్ తీగలు ఏర్పాటు చేయరాదని, వన్యప్రాణులు మృతి చెందితే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరు.

February 21, 2026 / 02:32 PM IST

నదులను కాపాడటం ప్రతి పౌరుని కర్తవ్యం: కలెక్టర్

కర్నూలు : పౌరుల బాధ్యతాయుత సహకారంతోనే నదుల సంరక్షణ ఫలప్రదమవుతుందని, నదులను కాపాడటం ప్రతి పౌరుని కర్తవ్యం అని జిల్లా కలెక్టర్ ఏ.సిరి పేర్కొన్నారు. శనివారం వినాయక ఘాట్ సమీపంలో కెసి కెనాల్‌లో కొనసాగుతున్న శుభ్రత పనులను నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్‌తో కలిసి కలెక్టర్ పరిశీలించారు.

February 21, 2026 / 02:30 PM IST

రెగ్యులేటర్ పునః నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీ

కృష్ణా: గుడివాడ మండలం మోటూరు గ్రామంలో రెగ్యులేటర్ పునః నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో కలిసి ఎంపీ వల్లభనేని బాలశౌరి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఈ రెగ్యులేటర్ పునః నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రాంతీయ రైతులకు నీటి సరఫరా మెరుగుపడి వ్యవసాయానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

February 21, 2026 / 02:28 PM IST

తలుపులలో ‘చెత్త నుంచి సంపద’ సేకరణకు స్వచ్ఛ రథం

సత్యసాయి: తలుపుల మండల పరిషత్ కార్యాలయం వేదికగా ‘స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర’ లక్ష్య సాధనలో భాగంగా ‘చెత్త నుంచి సంపద’ సృష్టించే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ప్రారంభించారు. ఇంట్లోని వ్యర్థాలను అందజేస్తే, ప్రతిగా ఉపయోగపడే వస్తువులను స్వచ్ఛ రథం ద్వారా పంపిణీ చేస్తున్నారు. ఈ వినూత్న సేవల పట్ల పల్లె ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

February 21, 2026 / 02:20 PM IST

ఈ-వేస్ట్ పర్యావరణానికి ప్రమాదకరం: ఎమ్మెల్యే

ATP: అనంతపురం ఓల్డ్ టౌన్‌లో శనివారం నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ-వేస్ట్ సేకరణ కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తాయని హెచ్చరించారు. పాత ఎలక్ట్రానిక్ వస్తువులను ఇక్కడ ఏర్పాటు చేసిన కౌంటర్లలోనే అందజేయాలని కోరారు.

February 21, 2026 / 02:20 PM IST

నల్లచెరువు ఘటనపై కమిషనర్ సీరియస్

GNTR: నల్లచెరువులో బాలుడిపై వీధి కుక్క దాడి చేసిన ఘటనపై శనివారం కమిషనర్ మయూర్ అశోక్ స్పందించారు. ఈ నెలలోనే ఏబీసీ (ABC) సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చి కుక్కల నియంత్రణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. యానిమల్ బోర్డ్ అనుమతులు వచ్చినందున డాక్టర్లు, సిబ్బందిని సిద్ధం చేయాలన్నారు. గాయపడిన బాలుడికి మెరుగైన వైద్యం అందేలా పర్యవేక్షించాలని సూచించారు.

February 21, 2026 / 02:18 PM IST

పొన్నపురంలో శక్తి యాప్ అవగాహన

నంద్యాల శక్తి టీం శనివారం పొన్నపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు 122 నంబర్, శక్తి యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు. అపరిచితుల వద్ద తినుబండారాలు తీసుకోవద్దని, అసభ్య ప్రవర్తన ఎదురైతే తల్లిదండ్రులు లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. బాగా చదివి మంచి పేరు తెచ్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శక్తి టీం ప్రసాద్, వెంకటేశ్వర్లు, రఫీ పాల్గొన్నారు.

February 21, 2026 / 02:15 PM IST

గిద్దలూరులో స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం

ప్రకాశం: గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలో కమిషనర్ ఈ.వి. రమణబాబు, అర్బన్ సీఐ సురేష్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది, పోలీసులు సంయుక్తంగా స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన రహదారులు, కాలువలు, చెత్త పేరుకుపోయిన ప్రదేశాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా కమిషనర్ ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.

February 21, 2026 / 02:15 PM IST