అన్నమయ్య జిల్లాలో శనివారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు. సీఎం చంద్రబాబు పిలుపు మేరకు జిల్లా ఎస్పీ ధీరజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అమలు చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లు, కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది శ్రమదానంలో పాల్గొని ప్రాంగణాలను శుభ్రం చేశారు.