WG: పోలీస్ శాఖలో సిబ్బంది కొరత ఉన్నా సాంకేతికతతో అధిగమిస్తున్నామని ఏలూరు రేంజ్ ఐజీ జివిజీ అశోక్ కుమార్ తెలిపారు. శనివారం అచంటలో ఆయన మాట్లాడారు. నేరాల దర్యాప్తులో సీసీ కెమెరాలు, ఏఐ కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. జిల్లాలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని, డ్రంక్ అండ్ డ్రైవ్, బైక్ చోరీలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు.