NDL: నందికొట్కూరు మండలం బ్రాహ్మణ కొట్కూరు PS పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని SI మణికంఠ హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు డ్రోన్తో ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. జూదం ఆడటం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం వంటివి చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.