TPT: ఏళ్ల తరబడి నిరీక్షణకు తెరదించుతూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శెట్టిపల్లి భూ సమస్యను పరిష్కరించి వేల కుటుంబాలలో సంతోషం నింపిన తుడా ఛైర్మన్ దివాకర్ రెడ్డికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు పోరాటాలు, నిరసనలను చేసి అలసిపోయిన తమ జీవితాలకు తుడా ఛైర్మన్ దివాకర్ రెడ్డి వెలుగును నింపారని ఆనందపడుతూ ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు.
E.G: కొవ్వూరులో ఎస్సీ కమిషన్ ఛైర్మన్, మాజీ మంత్రి కొత్తపల్లి జవహర్ను శుక్రవారం KVPS తూ.గో జిల్లా ప్రధాన కార్యదర్శి జువ్వల రాంబాబు, CITU జిల్లా అధ్యక్షులు ఎం. సుందరబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. దళితుల సంక్షేమానికి కృషి చేయాలన్నారు.
VZM : గజపతినగరంలోని సాయి సిద్ధార్థ జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో శుక్రవారం రక్తదాన శిబిరం జరిగింది. కళాశాల ఛైర్మన్ డాక్టర్ ఎస్ పెద్ది నాయుడు, శారదానాయుడు ప్రారంభించిన శిబిరంలో 81 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. కళాశాల కరస్పాండెంట్ ఎస్ చంద్రశేఖర్ 48వ సారి రక్తదానంలో పాల్గొన్నారు. విద్యార్థులు అధ్యాపకులు సిబ్బంది రక్తదానం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
NDL: కొలిమిగుండ్ల సొసైటీ ఛైర్మన్గా అంబటి వివేకానంద రెడ్డి శుక్రవారం అధికారుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. సొసైటీ ఛైర్మన్గా అంబటి వివేకానంద రెడ్డి, వైస్ ఛైర్మన్లుగా కొప్పుల వెంకట శివారెడ్డి, పోతిరెడ్డి సత్యనారాయణరెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన వారికి మండలంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు.
CTR: నగరి మున్సిపాలిటీ కాలనీకు చెందిన TDP నాయకులు ఎన్. వెంకటేష్ శుక్రవారం మృతిచెందారు. ఈ సందర్భంగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ వారి ఇంటికి చేరుకున్నారు. ఆయన భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని సూచించారు.
NLR: కోవూరు నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మెన్గా విడవలూరు మండలానికి చెందిన బెజవాడ వంశీకృష్ణా రెడ్డిని నియామిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. నెల్లూరు మాగుంట లేఔట్లోని MLA ప్రశాంతి రెడ్డి నివాసంలో కోవూరు నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కష్టపడి పని చేసిన వారిని పార్టీ గుర్తిస్తుందని ఎమ్మెల్యే అన్నారు.
GNTR: పొన్నూరులో శుక్రవారం మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవం సందర్భంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. మార్కెట్ సెంటర్లో ఉన్న జెండా చెట్టు వద్ద నిర్వాహకులు సయ్యద్ జైనులావుద్దీన్ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
TPT: తిరుపతి రుయా ఆసుపత్రి ప్రాంగణంలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఈ మేరకు మృతుడి వయస్సు 65 సంవత్సరాలు ఉంటాయని చెప్పారు. కాగా, మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తిగా గుర్తించారు. మృతదేహాన్ని రుయా మార్చురీకి తరలించారు. ఎవరైనా గుర్తిస్తే తిరుపతి వెస్ట్ పోలీసులను సంప్రదించాలని కోరారు.
సత్యసాయి: మడకశిరలో పార్టీ నాయకులతో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సమావేశం నిర్వహించారు. ఈనెల 10న అనంతపురంలో జరగనున్న ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ సభను విజయవంతం చేయాలని టీడీపీ నాయకులను కోరారు. ఎన్నికల హామీలను నెరవేర్చినందుకు నిర్వహిస్తున్న ఈ సభకు సీఎం నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరవుతారని తెలిపారు.
ATP: కళ్యాణదుర్గం ప్రజా వేదికలో టీచర్స్ డే వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సురేంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గురువులను సన్మానించడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. అనంతరం సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
E.G: కొవ్వూరులోని TDP కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన గ్రీవెన్స్లో కొవ్వూరు MLA ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు హెల్త్ పింఛన్లు, రెవెన్యూ సంస్థలు, ఇళ్ల స్థలాలు తదితర సమస్యలపై 10 వినతి పత్రాలు స్వీకరించారు. వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
KDP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కడప జిల్లాలో 2,560 MW సామర్థ్యం కలిగిన పలు విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఈ మేరకు జమ్మలమడుగు, ముద్దనూరు మండలాల్లోని గ్రామాల్లో100 MW విండ్ పవర్ ప్రాజెక్టులు, మైలవరం మండలంలో 60 MW హైబ్రిడ్ విండ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్, కొప్పోలులో 2400 MW పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు.
ప్రకాశం: చీమకుర్తిలో శ్రీ కృష్ణుడి దేవస్థానంలో గణపతి లడ్డు వేలం వేయగా బత్తుల వెంకటేశ్వర్లు రూ.1,05,000కు దక్కించుకున్నారు. ఇందులో భాగంగా స్వామివారి కలశం వేలంపాటలో తలారి చంద్రశేఖర్ రూ.20వేలకు కైవసం చేసుకున్నారు. కాగా, తదుపరి స్వామివారి లడ్డును ఊరేగింపుగా చీమకుర్తి ప్రధాన రహదారులగుండా ఘనంగా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
KDP: బ్రహ్మంగారిమఠంలోని కనుమ పోలేరమ్మ ఆలయంలో శుక్రవారం అమ్మవారి రథోత్సవ కార్యక్రమాన్ని అర్చకులు ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలేరమ్మ అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కాగా, అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. అనంతరం ఆలయ కమిటీ వారు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
CTR: పుదీపట్లలో గల స్వయంభు శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఉదయాన్నే ఆలయ ప్రధాన అర్చకురాలు శ్రావణి ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు అలంకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో స్వయంభు వైష్ణవి దేవి ఆలయం కిటకిటలాడింది. అనంతరం ఆలయ నిర్మాణ కర్త వినోద్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రసాదం పంపిణీ చేశారు.