• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పెదకాకాని బాజీ బాబా దర్గా అభివృద్ధి పనులు ప్రారంభం

GNTR: పెదకాకానిలోని బాజీ బాబా దర్గా అభివృద్ధికి వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆదేశాల మేరకు పనులు ప్రారంభమయ్యాయి. శుక్రవారం దర్గా పరిసరాల్లోని చెత్త తొలగింపు పనులు చేపట్టామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని దర్గా ఈవో షేక్ కాజా మస్తాన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ బాజీ, షేక్ సిలార్ తదితరులు పాల్గొన్నారు.

September 5, 2025 / 01:30 PM IST

ఉపాధ్యముల దినోత్సవంలో పాల్గొన్న కలెక్టర్

VM: సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయ పాత్ర కీలకమని, ఉపాధ్యాయ పని వృత్తి కాదని, సమాజం రూపు రేఖలు మార్చే శక్తి యని కలెక్టర్ డా.బి.ఆర్.అంబేడ్కర్ తెలిపారు. అటువంటి ఉపాధ్యాయుల్నిసత్కరించుకోవడం మా బాధ్యత యని కలెక్టర్ పేర్కొనారు. కలెక్టరేట్‌లో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తొలుత డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.

September 5, 2025 / 01:30 PM IST

ఘనంగా నూతన చర్చి ప్రారంభం

KRNL: ఆదోని మండలం దొడ్డనగేరి గ్రామంలో RCM నూతన చర్చి ప్రారంభం ఫాదర్ రాజేంద్ర ఆధ్వర్యంలో శుక్రవారం అట్టహాసంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కర్నూలు పీఠాధిపతులు గోరంట్ల జ్వానేస్ పాల్గొన్నారు. ముందుగా నూతన ఆలయ ప్రతిష్ట దివ్యబలి పూజ నిర్వహించారు. అనంతరం చర్చిలో భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. గ్రామంలోని ప్రజలు ఎల్లపుడు ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు.

September 5, 2025 / 01:30 PM IST

సర్వేపల్లి జీవితం గురువులకు మార్గదర్శకం

SKLM: మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం నేటి గురువులకు మార్గదర్శకంగా నిలిచిందని ప్రిన్సిపాల్ డాక్టర్ పెద్దాడ లత తెలిపారు. శుక్రవారం నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. టీచర్స్ డే కూడా కొనసాగించామని వివరించారు. సర్వేపల్లి ఆదర్శాలు భావితరాల గురువులకు దిక్సూచిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

September 5, 2025 / 01:30 PM IST

ఉపాధ్యాయులు విద్యార్థుల భవితకు దిశా నిర్దేశకులు

కృష్ణా: ఉపాధ్యాయులు విద్యార్థుల భవితకు దిశా నిర్దేశకులని వక్తలు అన్నారు. శుక్రవారం అవనిగడ్డ వంతెన సెంటరులో ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి, ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కృష్ణారావు విగ్రహానికి విశ్రాంత ఉపాధ్యాయులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. గురు పూజోత్సవం సందర్భంగా వారిని నాయకులు సత్కరించారు.

September 5, 2025 / 01:27 PM IST

సాఫ్ట్వేర్ ఉద్యోగికి మూడేళ్ల జైలు శిక్ష

VSP: సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.60 వేల జరిమానా విధిస్తూ విశాఖ ప్రధాన జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎం. ప్రదీప్ కుమార్ తీర్పునిచ్చారు. బుచ్చిరాజుపాలెంకు సాయికుమార్ మర్రిపాలెంలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తూ ఉద్యోగినిలకు అసభ్యకర మొయిల్స్ పంపేవాడు. ఈ ఘటనపై విశాఖ సైబర్ పోలీసులు గతేడాది కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

September 5, 2025 / 01:26 PM IST

స్వయం ఉపాధితో ఆదర్శంగా నిలుస్తున్న మహిళ

ATP: కనేకల్‌కు చెందిన మహిళ శాంతి టైలరింగ్ నేర్చుకొని జీవనం సాగిస్తున్నారు. స్వయం ఉపాధిపై మక్కువతో తిరుమల స్వయం సహాయక సంఘంలో చేరి స్త్రీనిధి ద్వారా రూ.2 లక్షల రుణం తీసుకున్నారు. కంప్యూటరైజ్‌డ్ ఎంబ్రాయిడింగ్ మిషన్ కొనుగోలు చేసి ప్రస్తుతం నెలకు రూ.25వేల ఆదాయం పొందుతూ ఇద్దరికి ఉపాధి కల్పిస్తున్నారు. మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

September 5, 2025 / 01:23 PM IST

పొన్నూరు పురపాలక సంఘ కమిషనర్ పార్కుల పర్యటన

GNTR: పొన్నూరు పురపాలక సంఘ కమిషనర్ ముప్పాళ్ళ రమేష్ బాబు శుక్రవారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పాత పొన్నూరులోని అంబేద్కర్ పార్క్, నిడుబ్రోలులోని పెద్దన్న పార్క్‌లను మానసిక ఉల్లాసం పొందడం వంటి అవసరాల కోసం వినియోగించాలని కమిషనర్ పేర్కొన్నారు.

September 5, 2025 / 01:23 PM IST

పుల్లడిగుంటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

GNTR: వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట గ్రామంలో శుక్రవారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ పార్టీ టీడీపీ అధ్యక్షుడు యడ్లపల్లి వీరప్రసాద్, వేంపరాల కిషోర్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అర్హులైన ప్రజలందరికీ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కంతేరు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

September 5, 2025 / 01:22 PM IST

రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

W.G: భీమవరం మండలం కొత్తపూసమర్రు గ్రామంలో శుక్రవారం సుమారు రూ 70 లక్షల రోడ్డు పనులకు ఎమ్మెల్యే అంజిబాబు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధన్యత ఇస్తుందని నియోజకవర్గ అభివృద్దికి అన్ని విధాలుగా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి నాయకులు పాల్గొన్నారు.

September 5, 2025 / 01:22 PM IST

పార్వతీపురంలో మెడికల్ కళాశాల

PPM: పార్వతీపురంలో వైద్య కళాశాలను ఏర్పాటు చేయుటకు ప్రభుత్వం అంగీకారం తెలియజేసిందని రాష్ట్రగిరిజన సంక్షేమ శాఖ మంత్రి  గుమ్మిడి సంధ్యా రాణి తెలిపారు. కురుపాం ఇంజనీరింగ్ కాలేజీని పూర్తి చేయుటకు ముఖ్య మంత్రి చర్యలు చేపట్టారని ఆమె చెప్పారు. ఉపాధ్యాయ దినోత్సవం స్ధానిక లయన్స్ క్లబ్ లో శుక్రవారం ఘనంగా జరిగింది.

September 5, 2025 / 01:20 PM IST

మిలాద్ ఉన్ నబి వేడుకల్లో కదిరి ఎమ్మెల్యే

సత్యసాయి: కదిరి పట్టణంలో శుక్రవారం మిలాద్ ఉన్ నబి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రవక్త మహమ్మద్ జన్మదినం సందర్భంగా నిర్వహించిన జూలూస్ శాంతి ర్యాలీలో ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పాల్గొని, ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ర్యాలీ సర్వ మానవాళి శ్రేయస్సు, శాంతికి ప్రతీకగా నిలిచిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

September 5, 2025 / 01:20 PM IST

ఉచిత వైద్య శిబిరాలను ప్రారంభం

E.G: కోరుకొండ మండలం నాగంపల్లిలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో భాగంగా శుక్రవారం ఉచిత వైద్య శిభిరం, ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాలను జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కో ఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్యం అందించాలనే ఉద్దేశంతో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసామన్నారు.

September 5, 2025 / 01:20 PM IST

తెనాలిలో అర్జీలను స్వీకరించిన మంత్రి

GNTR: తెనాలి బోసురోడ్డులోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. నియోజకవర్గ పరిధిలోని ప్రజలు పింఛన్లు, రేషన్ కార్డులు వంటి వివిధ సమస్యలపై ఆయనకు వినతిపత్రాలు అందజేశారు. వాటిని పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు.

September 5, 2025 / 01:16 PM IST

కామేపల్లిలో గ్రహణం రోజు పోలేరమ్మ ఆలయం మూసివేత

ప్రకాశం: ఈనెల 7 ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం. కాబట్టి ఆరోజు కామేపల్లిలోని పోలేరమ్మ అమ్మవారి దేవాలయం మధ్యాహ్నం 2 గంటలకి మూసివేయబడుతుంది. ఈ విషయాన్ని ఆలయ ఈవో బైరాగి చౌదరి శుక్రవారం తెలిపారు. మరుసటి రోజు ఉదయం సోమవారం అమ్మవారికి సంప్రోక్షణ అనంతరం యదావిధిగా దర్శనం ఏర్పాట్లు ఉంటాయన్నారు.

September 5, 2025 / 01:15 PM IST