• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

సచివాలయాన్ని తనిఖీ చేసిన మున్సిపల్ ఛైర్మన్

ప్రకాశం: విధి నిర్వహణలో సచివాలయం సిబ్బంది బాధ్యతాయుతంగా ఉండాలని కనిగిరి మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ అన్నారు. గురువారం పట్టణంలోని 4వ సచివాలయాన్ని మున్సిపల్ చైర్మన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు పట్టిక సిబ్బంది పనితీరు, సంక్షేమపధకాలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. సచివాలయ సిబ్బంది పనితీరుతో ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలన్నారు.

September 4, 2025 / 07:26 PM IST

వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షులుగా అఖిలేష్ రెడ్డి

కోనసీమ: ముమ్మిడివరం నియోజకవర్గం వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షులుగా కోన వెంకట అఖిలేష్ రెడ్డి నియమితులయ్యారు. పార్టీ అధిష్టానం తనను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు విడుదల చేసిందని ఆయన తెలిపారు. పార్టీ అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తానని తెలిపారు. తనకు ఈ అవకాశం రావడానికి కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

September 4, 2025 / 07:26 PM IST

‘అవసరాల మేరకు యూరియా సరఫరా అవుతుంది’

ELR: జిల్లాలో యూరియాను నిరంతరం రైతుల అవసరాల మేరకు ప్రభుత్వం సరఫరా చేస్తుందనే విషయాన్నీ క్షేత్రస్థాయిలో రైతులకు స్పష్టంగా అవగాహన కలిగించాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎరువుల లభ్యత, సరఫరాలపై వ్యవసాయాధికారులతో గురువారం కలెక్టరేట్ నుండి టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

September 4, 2025 / 07:26 PM IST

సీఎం వీటికి సమాధానం చెప్పాలి: రంగయ్య

ATP: ప్రభుత్వంపై మాజీ ఎంపీ తలారి రంగయ్య మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాకు ఇచ్చిన హామీలు అమలను చేయడం లేదని తెలిపారు. ఆర్డీటీకి FCRA రెన్యువల్ చేయడం లేదని, జిల్లాకు నీటి సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. పెనుకొండ మెడికల్ కళాశాలను ప్రైవేటు చేశారని ఆరోపించారు. ఈనెల 10న జిల్లాకు వస్తున్న సీఎం వీటికి సమాధానం చెప్పాలని అన్నారు.

September 4, 2025 / 07:25 PM IST

ఈ – పంట నమోదును 30తేదీ లోపు పూర్తి చేయాలి : కలెక్టర్

TPT: ఈ – పంట నమోదు కార్యక్రమాన్ని సెప్టెంబర్ 30 లోపు పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. గురువారం వ్యవసాయ, ఉద్యానవన శాఖ, పశుసంవర్ధక శాఖ,రైతు సేవ కేంద్ర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు జిల్లాలో ఖరీఫ్ 2025 సీజన్‌కు గాను ఈ – పంట నమోదు కార్యక్రమం జులై 15వ తేదీ నుంచి ప్రారంభమైందని అన్ని భూములను ఈ – పంట యాప్ నందు నమోదు చేయాలని తెలిపారు.

September 4, 2025 / 07:20 PM IST

ఏఎంసీ ఛైర్మన్‌గా దుర్గా పార్వతి

ELR: చింతలపూడి ఏఎంసీ ఛైర్మన్‌గా చీదరాల దుర్గా పార్వతి నియమితులయ్యారు. ఈ సందర్భంగా గురువారం పార్టీ అధిష్టానం నుండి ఉత్తర్వులు వెలుపడ్డాయి. ఈ క్రమంలో పార్వతి భర్త మండల జనసేన పార్టీ అధ్యక్షులు మధుబాబు మాట్లాడారు. ఈ పదవీ కేటాయించినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే రోషన్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

September 4, 2025 / 07:19 PM IST

ఆరుగురు ఉత్తమ ఉపాధ్యాయులు ఎంపిక

W.G: ఆకివీడు మండలంలో ఉత్తమ ఉపాధ్యాయుల వివరాలను ఎంఈవో రవీంద్ర తెలిపారు. కె శకుంతల (ఎస్‌‌జీటీ, ఎంపీపీ ఎస్ నందమిల్లిపాడు), టి సుజాత (ఎస్జీటీ ఎంపీపీ, శివాలయం). పి.ముకుందరావు (ఎంపీపీ, టీఆర్కాలనీ), కేవీ సుబ్బారావు (జడ్పీ హైస్కూల్, ఆకివీడు), పీఎస్వీకే పరమేశ్వరి (సీఆర్ఫీ)లను ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేశామన్నారు.

September 4, 2025 / 07:19 PM IST

మధ్యవర్తిత్వానికి విశేష స్పందన

VZM: 90 రోజుల మధ్యవర్తిత్వ కార్యక్రమానికి భారీగా విశేష స్పందన లభించిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం భబిత తెలిపారు. గత మూడు నెలలుగా జిల్లా కోర్టులో ఉన్న మధ్యవర్తిత్వ కేంద్రానికి 1100 కేసులు మధ్యవర్తిత్వ ప్రక్రియకు పంపించగా అందులో 30 కేసులు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించబడ్డాయన్నారు. ఈ మధ్యవర్తిత్వానికి ప్రజల నుంచి స్పందన లభించిదన్నారు.

September 4, 2025 / 07:18 PM IST

అవనిగడ్డలో జేసీ ఆకస్మిక పరిశీలన

కృష్ణా: అవనిగడ్డలో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ గురువారం ఆకస్మిక పరిశీలనలు నిర్వహించారు. గ్రామంలోని గ్రోమోర్ సెంటర్, రైతు సేవా కేంద్రాలను పరిశీలించారు. తహసీల్దార్ కే.నాగమల్లేశ్వరరావు, రైతులతో మాట్లాడి యూరియా సరఫరా, విక్రయాల గురించి చర్చించారు. యూరియాపై అవాస్తవ ప్రచారాలు నమ్మవద్దని రైతులకు సూచించారు.

September 4, 2025 / 07:15 PM IST

రాయచోటి డ్వాక్రా రుణంలో రూ.12 లక్షల అవకతవకలు

అన్నమయ్య: రాయచోటి సరస్వతి నగర్ శ్రీ చౌడేశ్వరమ్మ డ్వాక్రా గ్రూప్‌లో రూ.12 లక్షల రుణం మంజూరులో అవకతవకలు జరిగినట్లు హ్యూమన్ రైట్స్ స్టూడెంట్ సెల్ జిల్లా అధ్యక్షుడు శెట్టిపల్లి సాయికుమార్ ఆరోపించారు. ఇందులో భాగంగా 10 మంది సభ్యులు ఉండాలి అన్న నిబంధనకు విరుద్ధంగా 9 మందికే రుణం మంజూరు కాగా, ఒక్కొక్కరి ఖాతాలో రూ.97,000 మాత్రమే జమై మిగిలిన డబ్బులు మాయమయ్యాయని తెలిపారు.

September 4, 2025 / 07:15 PM IST

అన్నా క్యాంటీన్ల నిర్వహణకు రూ. 2 లక్షల విరాళం

అన్నమయ్య: రాయచోటి నియోజకవర్గంలో కొనసాగుతున్న రెండు అన్నా క్యాంటీన్‌ల నిర్వహణ కోసం మండిపల్లి నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్టు తరఫున రూ. 2 లక్షల విరాళం అందజేయబడింది. ఈ మేరకు గురువారం మంత్రి రాంప్రసాద్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో అన్నా క్యాంటీన్ నిర్వాహకులకు మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి ఈ చెక్కును అందజేశారు.

September 4, 2025 / 07:13 PM IST

ఉత్తమ ఉపాధ్యాయురాలుగా సత్య అనసూర్య

ప్రకాశం: కొమరోలు మండలం గోపాలుని పల్లె గ్రామం MPP పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న ఉదయగిరి సత్య అనసూర్య జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపికైంది. మూలపల్లె గ్రామానికి చెందిన సత్య అనసూర్య 2018 DSC బ్యాచ్లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా ఎంపికైంది. ఐదు సంవత్సరాల సర్వీస్లో ఇప్పటివరకు 27 రోజులు మాత్రమే సెలవులు తీసుకుని నిత్యం పాఠశాల విద్యార్థులకు విద్య బోధిస్తోంది.

September 4, 2025 / 07:12 PM IST

కలెక్టర్‌తో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి భేటీ

NLR: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గురువారం నెల్లూరు కలెక్టర్ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని పెన్నానది కరకట్టలు బలోపేతం చేయాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కలెక్టర్‌ను కోరారు. ఇప్పటికే సోమశిల జలాశయంలో 65 టీఎంసీల నీళ్లు చేరిన నేపథ్యంలో త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

September 4, 2025 / 07:12 PM IST

‘కులపత్రాల జారీలో జాగ్రత్తలు తప్పనిసరి’

SKLM: కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసినపుడు జాగ్రత్తలు తప్పనిసరిని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తహసీల్దార్లను ఆదేశించారు. శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్కు సంబంధించి రెవెన్యూ అధికారులతో ఆయన పలు సమస్యలపై గురువారం సమీక్షించారు. క్షేత్రస్థాయిలో పరిశీలనచేసికుల ధృవీకరణ పత్రాలు జారీ చేయాలన్నారు. లేదంటే భవిష్యత్తులోనైనా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.

September 4, 2025 / 07:12 PM IST

కాకినాడలో గురుపూజోత్సవం: కలెక్టర్

KKD: మాజీ రాష్ట్రపతి డా.సర్వేపల్లి రాధకృష్ణన్ జయంతి సందర్భంగా కాకినాడ జేఎన్‌టీయూ ఆడిటోరియంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా గురు పూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ షన్మోహన్ సగిలి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ గురుపూజోత్సవం కార్యక్రమంలో జిల్లాకు చెందిన ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం చేయడం జరుగుతుందన్నారు.

September 4, 2025 / 07:12 PM IST