అన్నమయ్య: జిల్లా మదనపల్లిలో నూతన జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే షాజహాన్ బాషా, డీఐజీ కోయ ప్రవీణ్, కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ప్రారంభించారు. ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ కావడానికి ఈ కార్యాలయం ఉపయోగపడుతుందని తెలిపారు. ఇకపై ప్రజా సమస్యల పరిష్కార వేదిక కూడా ఇక్కడే జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు.
PLD: గుండ్లపాడు జంట హత్య కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బుధవారం బెయిల్ మంజూరైంది. జంట హత్య కేసులో ఆయన 6వ నిందితుడుగా ఉన్నాడు. 98 రోజులుగా నెల్లూరు జిల్లా జైలులో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గురజాల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి గుంటూరు సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
VZM: రోడ్డు ప్రమాదంలో మరణించిన గజపతినగరం కానిస్టేబుల్ టి. తిరుపతిరావు కుటుంబానికి తోటి సిబ్బంది కలిసి రూ.4.30 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఈ మొత్తాన్ని ఎస్పీ దామోదర్ చేతుల మీదుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో కుటుంబ సభ్యులకు బుధవారం అందజేశారు. సహోద్యోగి కుటుంబానికి అండగా నిలవడం ఐక్యతకు నిదర్శనమన్నారు.
VSP: అర్హులైన పేదలకు అర్బన్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు మురుపల్లి పైడిరాజు అన్నారు. బుధవారం మధురవాడలో ఆయన మాట్లాడారు. ఈనెల 24 నుంచి సచివాలయాల వద్ద ధర్నాలు చేపడతామని తెలిపారు. ఇళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, పెన్షన్ల కోతలు ఆపాలని కోరారు.
GNTR: కాకుమాను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న 10వ తరగతి పరీక్షలను తహసీల్దార్ బి. వేంకటస్వామి బుధవారం పరిశీలించారు. విద్యార్దులకు ఏర్పాటు చేసిన సదుపాయాలపై చీఫ్ సూపరింటెండెంట్తో మాట్లాడి తెలుసుకున్నారు. పరీక్షా కేంద్రంలో తాగునీరు,హెల్త్ క్యాంపు ఏర్పాట్లను సందర్శించారు. ఇందులో భాగంగా పలువురు అధికారులు పాల్గొన్నారు.
PPM: ప్రజల భాగస్వామ్యం, స్థానిక సహకారంతో పీహెచ్సీలను అభివృద్ధి చేయడమే “ముస్తాబు” లక్ష్యమని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి బుధవారం తెలిపారు. జీయ్యమ్మవలస మండలం ఆర్.ఆర్.బ పురం పీహెచ్సీని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రులు దేవాలయాల్లాంటివని పేర్కొంటూ, పరిశుభ్రత, మెరుగైన సేవలు ఉండాలని సూచించారు.
ATP: గుంతకల్లు సీపీఐ నాయకులు ఇవాళ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ కీర్తి కిరణ్ రెడ్డికి మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. సీపీఐ నాయకులు వీరభద్ర స్వామి మాట్లాడుతూ.. పట్టణంలోని నర్సింగ్ హోమ్లో 24×7 ప్రకారం ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ప్రమాదాలు సంభవించినప్పుడు రోగులను అడ్మిట్ చేసుకోవడం లేదని ఆయన తెలిపారు.
TPT: నారావారిపల్లెలో కీర్తి శేషు నారా రామ్మూర్తి నాయుడు 74వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో తుడా ఛైర్మన్ దివాకర్ రెడ్డి NRN ఘాట్లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొని, వారి కుమారులు నాయకులతో కలసి ఆయనకు పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో నారా రోహిత్, నారా గిరీష్, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
E.G: నిడదవోలు మండలం సెట్టిపేట గ్రామంలో లేస్ వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ నిర్వహిస్తున్న యూనిట్ను కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ చేతి అల్లికలతో అందంగా తీర్చిదిద్దిన వివిధ రకాల దుస్తులను పరిశీలించారు. ఈ మేరకు లేస్ వర్క్ & ఎంబ్రాయిడరీ రంగాల్లో మహిళలు చూపిస్తున్న ప్రతిభను ప్రత్యేకంగా అభినందించారు.
BPT:చీరాల మండలం ఈపురుపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని నక్కలవారిపాలెం ప్రాంతంలో బుధవారం పేకాట ఆడుతున్నారని వచ్చిన సమాచారంతో ఎస్సై చంద్రశేఖర్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 11,200 రూపాయలు నగదు, ఆరు మొబైల్ ఫోన్లు, ఆరు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు ఎస్సై చెప్పారు.
KDP: ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే మా లక్ష్యమని ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. 15వ డివిజన్ నిరంజన్ నగర్లో నిర్వహించిన “అక్షరం అండగా – పరిష్కారమే అజెండాగా” కార్యక్రమంలో ప్రజలతో నేరుగా మాట్లాడారు. డ్రైనేజీ, తాగునీరు, మౌలిక వసతుల సమస్యలను తెలుసుకున్నారు. వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
VZM: జిల్లాలో మామిడి రైతులకు అండగా నిలుస్తూ పంట దిగుబడి పెంపుకు ఉద్యాన శాఖ చర్యలు చేపడుతోందని జిల్లా ఉద్యాన అధికారి కె. చిట్టిబాబు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అకాల వర్షాలు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా పంటపై పురుగులు, తెగుళ్లు పెరిగిన నేపథ్యంలో గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
KRNL: కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ల మ్యాపింగ్ లో పొరపాట్లు జరగకుండా చూడాలని డీపీవో భాస్కర్ను ఆదేశించారు. బుధవారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో ఓటర్ల మ్యాపింగ్, తాగునీటి సమస్య, శానిటేషన్పై చర్యలు తీసుకోవాలని సూచించారు. 484 గ్రామ పంచాయతీలలో ఓటర్లను వార్డుల వారీగా సరిగ్గా మ్యాప్ చేశారా లేదా అని పరిశీలించారు.
ప్రకాశం: జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను బుధవారం హైదరాబాదులోని పవన్ కళ్యాణ్ నివాసంలో ఒంగోలుకి చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి చర్చలు జరిపారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం.
KRNL: కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలకు చెందిన 14 మంది లబ్ధిదారులకు ఎమ్యెల్యే బొగ్గుల దస్తగిరి రూ. 8,17,992ల విలువైన చెక్కులను బుధవారం పంపిణీ చేశారు. అనారోగ్యాలతో హాస్పిటల్లో వైద్యం చేయించుకొని సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకొన్న వారికి చెక్కులు అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.