E.G: కొవ్వూరులో వచ్చే పుష్కరాల నేపథ్యంలో చేపట్టనున్న అభివృద్ధి, సదుపాయాల పనులపై రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా భక్తుల సౌకర్యాలు, మౌలిక వసతులు, రహదారుల అభివృద్ధి, శుభ్రత & భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.