బాపట్ల: వేటపాలెం మండలం అక్కయ్యపాలెం పంచాయతి పరిధిలో లక్ష్మీపురం గ్రామంలో రూ. 30 లక్షలతో శుక్రవారం సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ అధ్యక్షులు జంగిలి రాముడు పాల్గొని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాలకొండయ్య ఆదేశాల ప్రకారం శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు.