• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పేర్ని జయసుధ బెయిల్ పిటిషన్‍పై నేడే తీర్పు

కృష్ణా: మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ పిటిషన్‌పై నేడు కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఇప్పటికే తన భార్య పేరుని అకారణంగా ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిందని పేర్ని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. నేడు బెయిల్ పిటిషన్‌పై జిల్లా కోర్టు తీర్పు వెల్లడించనుంది. కాగా బెయిల్ పిటిషన్ తీర్పుపై వైసీపీ నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

December 30, 2024 / 09:16 AM IST

31న విశాఖలో జాబ్ మేళా

Vsp: రేపు విశాఖ జిల్లా కంచరపాలెం ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించినునట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ శిక్షణ అధికారి చాముండేశ్వరరావు తెలిపారు. మేళాలోప్పలు కన్స్ట్రక్షన్, పలు ఫైనాన్స్, మెడిప్లస్ కంపెనీలు పాల్గొంటాయన్నారు. పదో తరగతి, ఇంటర్, ఐటిఐ ఎలక్ట్రీషియన్, డిగ్రీ డిప్లమా ఎలక్ట్రికల్ పూర్తి చేసిన వారు అర్హులన్నారు.

December 30, 2024 / 09:16 AM IST

గోవుల అక్రమ తరలింపు.. అడ్డగింత

SKLM: సరుబుజ్జిలి మండలం జలుమూరు నుంచి అల్మండ వైపుగా ఐదు బోలెరల్లో గోవులు తరలిస్తుండగా ఆదివారం రాత్రి స్థానికులు గమనించి మూడు బోలెరాలను పట్టుకున్నారు. ఈ మేరకు 21 గోవులను స్వాధీనం చేసుకుని, స్థానిక సరుబుజ్జిలి పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. రెండు బోలెరాలు తప్పించుకున్నాయని స్థానికులు పోలీసులకు తెలిపారు.

December 30, 2024 / 09:14 AM IST

ముద్దనూరు రైతులకు గమనిక

కడప: ఫసల్ బీమాకు ప్రీమియం చెల్లించేందుకు మంగళవారం వరకు గడువు ఉందని ముద్దనూరు మండల వ్యవసాయాధికారి మారెడ్డి వెంకట క్రిష్ణా రెడ్డి తెలిపారు. రబీ సీజన్లో వేసిన వేరుశనగ, శనగ, నువ్వులు, మినుములు, పెసర, పొద్దుతిరుగుడు, వరి పంటలకు ఫసల్ బీమా కింద రైతులు ఇన్సూరెన్స్ చేసుకోవాలని ఏఓ కోరారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

December 30, 2024 / 09:12 AM IST

ప్రారంభమైన పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల పరీక్షలు

KKD: జిల్లాలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలను సోమవారం నిర్వహించారు. ఈ పరీక్షల శిబిరాన్ని కాకినాడ ఎస్పీ విక్రాంత్ పాటిల్ పరిశీలించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అత్యంత పారదర్శకంగా ఈ దేహదారుడ్య పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.

December 30, 2024 / 09:02 AM IST

జి.మాడుగులలో గిరిజన విద్యార్థినిపై అత్యాచారం

అల్లూరి జిల్లా జి.మాడుగుల (M) గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. విద్యార్థినిపై ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ నెల 25న విద్యార్థిని అదృశ్యం కాగా తల్లిదండ్రులు 28న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

December 30, 2024 / 08:58 AM IST

నేడు విద్యుత్ సరఫరా నిలుపుదల

SKLM: కవిటి మండలంలోని రాజపురం సబ్ స్టేషన్ పరిధిలోని భైరిపురం 11కెవి ఫీడర్ పరిధిలో విద్యుత్ స్తంభాలు మార్పులు కారణంగా సోమవారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్టు ఈఈ జి.యజ్ఞేశ్వరరావు తెలిపారు. అందులో భాగంగా భైరిపురం, నెలవంక, కలసుకుద్ది పంచాయతీల పరిధిలోని గ్రామాలకు, రాజపురంలోని శ్రీశయణ వీధికి విద్యుత్ సరఫరా నిలుపు చేస్తామన్నారు.

December 30, 2024 / 08:47 AM IST

హైవేపై లారీ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

SKLM: పలాస మండలం రంగోయి జంక్షన్ సమీప జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పోతయ్య (57) రోడ్డు దాటుతుండగా వెనుక నుంచి లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో పోతయ్య తీవ్ర గాయాల పాలయ్యాడు. విషయం తెలుసుకున్న 1033 నేషనల్ హైవే అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

December 30, 2024 / 08:47 AM IST

పండగల సీజన్.. ప్రజలు అప్రమత్తంగాఉండాలి

VSP: సంక్రాంతి సీజన్లో దొంగతనాలు జరిగే అవకాశం ఉన్న నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెందుర్తి క్రైమ్ ఎస్సై సూరిబాబు తెలిపారు. ఆదివారం ఆయన పెందుర్తిలో మాట్లాడుతూ.. నేరాల అదుపు చేసేందుకు ప్రజల సహకారం కావాలన్నారు. పెందుర్తి ఏరియాలో జరుగుతున్న నేరాల నియంత్రణకు గస్తీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దొంగతనాలు పగలు రాత్రి తేడా లేకుండా జరుగుతున్నాయన్నారు.

December 30, 2024 / 08:46 AM IST

చాపరాయి 3 రోజుల ఆదాయం రూ.5,15,320

ASR: చాపరాయి జలపాతాన్ని తిలకించేందుకు మూడు రోజులు పాటు పర్యటకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. శుక్రవారం 3,612మంది సందర్శించాలని ప్రవేశ రుసుము ద్వారా రూ.1,71,960ఆదాయం వచ్చినట్లు, శనివారం 3,860 మంది సందర్శించాలని ప్రవేశ రుసుము ద్వారా రూ.1,85,580 ఆదాయం వచ్చినట్లు, అలాగే ఆదివారం 3,278 సందర్శించారని ప్రవేశ రుసుము ద్వారా రూ.1,57,780 వచ్చినట్లు సిబ్బంది తెలిపారు.

December 30, 2024 / 08:45 AM IST

గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో సొరంగ మార్గం?

కడప: త్వరలోనే ఉమ్మడి జిల్లాలో సొరంగ మార్గం నిర్మించనున్నారు. కడప-చిత్తూరు హైవేలోని గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో పలు వాహనాలు లోయలో పడి చాలామంది చనిపోయారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఇక్కడ 6కిలోమీటర్ల మేర సొరంగ మార్గం నిర్మించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా నిన్న ఢిల్లీ నుంచి వచ్చిన చీఫ్ ఇంజినీర్ రాహుల్ గుప్తా పరిశీలించారు.

December 30, 2024 / 08:43 AM IST

‘హెల్మెట్‌ లేకుండా ప్రకాశం బ్యారేజ్‌పైకి ప్రవేశం లేదు’

GNTR: ఇటీవల హైకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాల్సి ఉంటుందని, లేకపోతే సోమవారం నుంచి తాడేపల్లి ప్రకాశం బ్యారేజ్‌పైన ప్రవేశం ఉండదని అధికారులు తెలిపారు. కొంతకాలంగా రహదారులపై జరిగే ప్రమాదాలలో అత్యధికంగా ద్విచక్ర వాహనాలే ప్రమాదానికి గురవుతున్నాయన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పక హెల్మెట్ ధరించాలని సూచించారు.

December 30, 2024 / 08:39 AM IST

ఎయిర్టెల్ టవర్‌లో దొంగలు పడ్డారు

SKLM: భామిని మండలం స్థానిక ఎయిర్టెల్ టవర్‌లో విడిభాగాలు దొంగలించడానికి దొంగలు ప్రయత్నం చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎయిర్టెల్ సిబ్బంది తెలిపిన వివరాలు ప్రకారం.. శనివారం రాత్రి, టవర్‌కు పవర్ కట్ చేశారని, సిబ్బంది ఎలర్ట్ అయ్యి ముందు స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్ సమాచారం తెలుపగా, దొంగలు పరారైనట్లు తెలిపారు.

December 30, 2024 / 08:34 AM IST

కర్నూలు జడ్పీ ఛైర్మన్ నూతన సంవత్సర వేడుకలకు దూరం

NDL: ఉమ్మడి కర్నూలు జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి 2025 నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు ఆయన సోమవారం తెలిపారు. ఇటీవల మన దేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి చెందాడు. మన్మోహన్ సింగ్ మృతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వారం రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించింది. జనవరి 1న దూరంగా ఉంటున్నట్లు ఆయన తెలిపారు.

December 30, 2024 / 08:25 AM IST

అభిమానులకు మంత్రి సంధ్యారాణి విజ్ఞప్తి

PPM: నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన వారికి గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి సోమవారం కీలక విజ్ఞప్తి చేశారు. ఆమె మాట్లాడుతూ.. NEW YEAR శుభాకాంక్షలు తెలిపేందుకు ఇంటికి వచ్చే అభిమానులు నాయకులు, అధికారులు, శ్రేయోభిలాషులు ఎటువంటి పూల బొకేలు, బహుమతులు తీసుకురావద్దన్నారు. కేవలం అభినందనలు ఆశీస్సులు మాత్రం అందించాలని తెలిపారు.

December 30, 2024 / 08:19 AM IST