VSP: ఎలక్ట్రికల్ వర్కర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గోవింద హామి ఇచ్చారు. ఆదివారం మండలంలోని సత్యనారాయణ స్వామి దేవాలయం వద్ద జరిగిన ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. సమస్యలని ఎంపీ, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకు వెళ్తామన్నారు.
VSP: పిల్లలను అభివృద్ధి పథంలో నడిపేందుకు స్కౌట్స్ అండ్ గైడ్స్ మాస్టార్లు, గైడ్ కెప్టెన్స్ పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం అన్నారు. రైల్వే న్యూ కోలని ఈస్ట్ కోస్ట్ క్యాంపింగ్ సెంటర్లో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులను ఉపాధ్యాయులు కన్న పిల్లలాగా అభివృద్ధి పథాన నడిపే దిక్సూచిలా ఉండాలన్నారు.
ATP: సీనియర్ న్యాయవాది వాల్మీకి శేషాద్రి అనుమానాస్పద మృతిపై న్యాయ విచారణ చేపట్టాలని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి పేర్కొన్నారు. ఆదివారం రాత్రి అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రి ముందు న్యాయవాది కుటుంబీకులతో కలిసి ధర్నా చేపట్టారు. సాకే హరి మాట్లాడుతూ.. న్యాయవాది శేషాద్రి మృతి అనుమానాలకు తావిస్తోందని, విచారణ చేపటట్టి చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రకాశం: యర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఏరిక్షన్ బాబు ఆధ్వర్యంలో నేడు వినుకొండ రోడ్డులో గల ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. జాబ్ మేళాలో డీమర్టీ, ప్రీమియర్ సోలార్ ఎనర్జీ వంటి పలు కంపెనీలు పాల్గొననున్నాయి. ఈ అవకాశం నియోజకవర్గ నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
VSP: సబ్బవరం PS పరిధిలోని అమ్ములపాలెం వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందగా భార్య తీవ్రంగా గాయపడ్డారు. బలిజపాలెంకు చెందిన సూర్యారావు(48), భార్య మంగమ్మ ఆదివారం సబ్బవరం వచ్చారు. తిరిగి రాత్రి 7 గంటలకు బైక్పై స్వగ్రామం బయలుదేరారు. అమ్ములపాలెం వద్ద వెనుక వస్తున్న ట్రాక్టర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో సూర్యారావు చనిపోయారు.
TPT : నూతన సంవత్సర వేడుకలను సాకుగా చూపి బైక్లు, కార్లను రేసింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త సంవత్సరాన్ని ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. డిసెంబరు 31 రాత్రి శ్రీకాళహస్తి పట్టణంతో పాటు తొట్టంబేడు, బీఎన్ కండ్రిగ రోడ్డులో తనిఖీలుంటాయాన్నారు. అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు.
NDL: ప్రకృతిలో వస్తున్న మార్పుల కారణంగా ఒక్కోసారి సూర్యుడు కనిపించని పరిస్థితి నెలకొంటుంది. అలాంటిది సోమవారం ఉదయం వేళ మంచు కప్పి వేయడంతో సూర్యుడు మంచు తెరల్ని చీల్చుకుంటూ తన ఎర్రని వర్ణంతో ప్రకృతికి వెలుగుని ప్రసాదిస్తున్నట్లుగా అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. ఒకవైపు చలికి వనికి పోతున్న జీవరాశికి నులివెచ్చని కిరణాలతో చైతన్యం కలిగిస్తున్నట్లుగా కనిపించింది.
ATP: గుత్తి పట్టణంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి, నగరేశ్వర స్వామి శివాలయాలలో సోమవారం శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు శివలింగానికి పూర్వక రుద్రాభిషేకం, పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం శివలింగానికి వెండి ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.
KRNL: ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సి. బెళగల్ ఎస్సై తిమ్మారెడ్డి వాహనదారులకు సూచించారు. జి. బెళగల్లో ద్విచక్రవాహ నాదారులు మోటార్ సైకిల్లకు జరిమానాలను ఆన్లైన్లో చెల్లించాలన్నారు. అలా చెల్లించని వాహనాలను స్టేషన్కు తరలిస్తామని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు స్వస్తి పలకాలని అన్నారు. నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణలో ఆనందంగా జరుపుకోవాలని అన్నారు.
కృష్ణా: విజయవాడలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. కృష్ణలంక పోలీసుల వివరాల మేరకు.. బందరు కాలువలో వీఎంసీ గేట్ వద్ద ఆదివారం గుర్తుతెలియని మృతదేహం ఉందన్న సమాచారం మేరకు పరిశీలించామన్నారు. ఈ క్రమంలో అతని వయసు 40 నుంచి 45 సంవత్సరం మధ్య వయసు ఉంటుందన్నారు. మృతుడు 5 అడుగులు ఉన్నాడని, గోధుమ కలర్ షర్ట్, బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడన్నారు.
ప్రకాశం: కొమరోలు మండలం దద్దవాడ జాతీయ రహదారిపై ఆదివారం ఆటోను తప్పించే క్రమంలో కారు ఆటోను ఢీ కొట్టి మరో బైక్ ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడగా, మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడ్డ వ్యక్తిని గిద్దలూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కారు వాహనాలను తప్పించే క్రమంలో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఓ పాత ఇంటిని ఢీ కొట్టింది.
ATP: ఛాంపియన్ ఆఫ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ (CBWR)లో యాడికి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ విష్ణు భగవాన్కు చోటు దక్కింది. ప్రపంచంలోని పురాతన నాణేల సేకరణలో విష్ణు భగవాన్ అత్యంత ప్రతిభ కనబరిచారని ఛాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ నెల 31న గుజరాత్లో అవార్డు అందుకోనున్నారు.
నెల్లూరు నగరంలో తూర్పు, పడమర ప్రాంతాలను కలుపుతూ రైల్వే ఫ్లై ఓవర్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ఆదివారం స్టోన్ హౌస్ పేటలోని పాండురంగ అన్నదాన సమాజంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్యులకు ఎల్లవేళలా అండగా ఉంటుందని ఆయన తెలిపారు.
బాపట్ల: నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా తనను కలిసేందుకు, శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే అభిమానులు, ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పూల బొకేలు, గజమాలలు, పూల దండలు, దుశ్శాలువలు తీసుకురావద్దని ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు పిలుపునిచ్చారు. బొకేలు, పూలమాలలు తెచ్చే వారు అదే ఖర్చుతో పేద విద్యార్థులకు ఉపయోగపడే విధంగా పుస్తకాలు, పెన్నులు అందించాలని కోరారు.
KKD: సామర్లకోట మండలంలో వేట్లపాలెంలో జరిగిన హత్యల నేపథ్యంలో ఆదివారం పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి రాజు, కాకినాడ ఆర్డీవో మల్లిబాబు పర్యటించారు. వేట్లపాలెం గ్రామంలో ఎస్సీపేటలో ఇరువర్గాలకు చెందిన నివాస ప్రాంతాల్లో పర్యటించి అక్కడి ప్రజలతోనూ మాట్లాడారు. జరిగిన ఘటన దురదృష్టకరమని, సంబంధితులు అందరిపై కేసులు పెట్టామని, చట్టప్రకారం చర్యలు తప్పక తీసుకుంటామని చెప్పారు.