KRNL: కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ.కుమారస్వామి సోమవారం మంత్రాలయాన్ని సందర్శించి శ్రీ రాఘవేంద్ర స్వామి మూలబృందావనాన్ని దర్శించుకున్నారు. గురు వైభవోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మఠం పీఠాధిపతి సుభుధేంద్ర తీర్థ స్వామి ఆశీర్వచనం అందజేశారు. అనంతరం హెలిప్యాడ్ వద్ద అధికారులు, నాయకులు ఆయనకు ఆత్మీయ వీడ్కోలు పలికారు.