PLD: సత్తెనపల్లిలోని గ్రంథాలయం ఎదుట ఉన్న రోడ్డు డివైడర్పై సోమవారం రాత్రి ఒక వ్యక్తి శవమై కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. మృతుడు మద్యం మత్తులో ప్రాణాలు విడిచి ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అనే వివరాలు తెలియాల్సి ఉంది.