• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

బీజేపీ కలిదిండి మండల అధ్యక్షుడిగా దుర్గాప్రసాద్

ELR: కలిదిండి మండలం కలిదిండి గ్రామంలో బీజేపీ పార్టీ మండల కమిటీ ఎన్నిక సమావేశం ఆదివారం ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కలిదిండి బీజేపీ మండలపార్టీ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన అంకాళ దుర్గ ప్రసాద్‌ని సభ్యులు ఎన్నుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే ఆయనను అభినంధించి పార్టీ బలోపేతానికి కృషిచేయ్యాలన్నారు.

December 30, 2024 / 07:45 AM IST

కోడిపందాలపై మెరుపు దాడి.. 9 మంది అరెస్ట్

W.G: భీమడోలు మండలం గుండుగోలను కుండీల పేట శివారులో ఆదివారం జరుగుతున్న కోడిపందాలపై ఎస్ఐ సుధాకర్ తన సిబ్బందితో మెరుగు దాడి చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐఐ మాట్లాడుతూ.. ఈ దాడిలో 7 ద్విచక్ర వాహనాలు, 9 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. అలాగే 1 కోడిపుంజు, 2 కోడి కత్తులు, రూ.3500 నగదు స్వాధీన పరుచుకున్నామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

December 30, 2024 / 07:43 AM IST

నామినేటెడ్ పదవులు భర్తీకి నోటిఫికేషన్

NDL: స్థానిక MLAల ఆధ్వర్యంలో జిల్లాలోని 8 అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ(AMC)ల నామినేటెడ్ ఛైర్మన్ పదవుల నియామకానికి కలెక్టర్ జీ.రాజకుమారి నోటిఫికేషన్ జారీ చేశారు. నంద్యాల (AMC)-OC ఉమెన్, ఆళ్లగడ్డ-SC ఉమెన్, డోన్-BC ఉమెన్, నందికొట్కూరు-OC జనరల్, ఆత్మకూరు-OC జనరల్, బనగానపల్లె-OC జనరల్, కోవెలకుంట్ల-OC జనరల్, పాణ్యం-BC ఉమెన్ ఉన్నట్లు పేర్కొన్నారు.

December 30, 2024 / 07:42 AM IST

రేకుల షెడ్డులో విద్యా బోధనలు

ASR: హుకుంపేట మండలంలోని ఎగరూడి గ్రామంలో పాఠశాల భవనం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు తెలిపారు. నాడు నేడులో భాగంగా 2022-23 సంవత్సరంలో రూ.23 లక్షలు పాఠశాల నిర్మాణానికి మంజూరయ్య పిల్లర్ లెవెల్ వరకు నిర్మించి మధ్యలో నిలిచిపోయిందని తెలిపారు. దీంతో రేకుల షెడ్డులో విద్యా బోధనలు సాగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

December 30, 2024 / 07:38 AM IST

గైస్లో నేటి నుంచి నేషనల్ సింపోజియం

VSP: కంచరపాలెం ప్రభుత్వ కెమికల్ ఇంజనీరింగ్ ఇనిస్టిట్యూట్ (గైస్)లో సోమవారం నుంచి ఫార్మా కంపెనీల్లో ప్రమాదాల నివారణపై నేషనల్ సింపోజియం నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటరమణ తెలిపారు. ఫైర్ సర్వీసెస్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కార్మిక శాఖ సంయుక్తంగా రెండు రోజులు సింపోజియం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

December 30, 2024 / 07:38 AM IST

వారం రోజుల్లోపు వివరణ ఇవ్వాలి: VMRDAచైర్మన్

VSP: సీతామ్మధారలో NRI హాస్పిటల్‌ను NRI కోటాలో పలు నిబంధనలతో సేల్ డీడ్ ద్వారా VMRDA కేటాయించిందని చైర్మన్ ప్రణవ్ గోపాల్ అన్నారు. 10- 20శాతం పేద రోగులకు ఉచితంగా వైద్యం అందించాలని నిబంధనలలో పేర్కొన్నామన్నారు. MVP కాలనీలో క్యాన్సర్ హాస్పిటల్ కూడా NRI కోటాలోనే కేటాయించామన్నారు. రెండు హాస్పిటల్స్‌లో అందుతున్న ఉచిత వైద్యంపై వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చారు.

December 30, 2024 / 07:35 AM IST

బాలిక అదృశ్యంపై కేసు నమోదు

W.G: తణుకు నియోజకవర్గం అత్తిలి మండలం బల్లిపాడు గ్రామానికి చెందిన బాలిక (17) పదో తరగతి చదివి ఇంటి వద్దే ఉంటోంది. ఈ నెల 26న బాలిక బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. ఎంత వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆదివారం ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రేమరాజు తెలిపారు.

December 30, 2024 / 07:34 AM IST

పూర్వపు విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

సత్యసాయి: పెనుకొండ మండలం గుట్టూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1988-89 సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం పూర్వపు విద్యార్థుల సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా ఒకరినొకరు ఆప్యాయతగా పలకరించుకొని బాగోగులు గురించి అడిగి తెలుసుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం అప్పటి విద్యార్థి న్యాయవాదిగా స్థిరపడిన నాగరాజు అందరికీ విందును ఏర్పాటు చేశారు.

December 30, 2024 / 07:33 AM IST

నేడు ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం: కలెక్టర్

సత్యసాయి: జిల్లా కలెక్టరేట్లో సోమవారం ఉదయం ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీఎస్ చేతన్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలతో వినతి పత్రాలు స్వీకరిస్తామని తెలిపారు. వాటిని సంబంధిత అధికారులకు పంపి పరిష్కరిస్తామని చెప్పారు.

December 30, 2024 / 07:30 AM IST

మనస్థాపానికి గురై వివాహిత ఆత్మహత్య..

E.G: నిడదవోలు మండలం డి.ముప్పవరంలో ఆదివారం వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. భార్యభర్తల మధ్య గొడవతో మనస్థాపానికి గురై భార్య ఆత్మహత్య చేసుకుంది. దీంతో మృతురాలి ఇద్దరు పిల్లలు అనాథలు అయ్యారు. తల్లిచనిపోయిందని తెలియని ఆ చిన్నారులు అమ్మకావాలని అంటుడటం అక్కడివారి కంట కన్నీరు తెప్పించింది. కాగా, ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

December 30, 2024 / 07:29 AM IST

నేడు కొత్తపేటలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

E.G: కొత్తపేట విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో 11కేవీ విద్యుత్ లైన్ల మరమ్మతుల పనుల్లో భాగంగా మండలంలోని మోడేకుర్రు, గొలకోటివారిపాలెం గ్రామాలకు సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని విద్యుత్ శాఖ ఈఈ ఎం. రవికుమార్ తెలిపారు. వినియోగదారులు విద్యుత్ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.

December 30, 2024 / 07:27 AM IST

సీతంపేట పర్యాటక ప్రాంతాలను సందర్శించిన జిల్లా కలెక్టర్

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఏజెన్సీ అందాలను జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తన కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆడలి వ్యూ పాయింట్, ఎన్టీఆర్ అడ్వాంచర్ పార్క్, బెనరాయి జలపాతాలను సందర్శించారు. ఎన్టీఆర్ అడ్వాంచర్ పార్క్ పలు సాహస క్రీడలను ఆస్వాదించారు. హ్యంగింగ్ బ్రిడ్జి, ఆర్చరీ, షూటింగ్ వంటి క్రీడలను చేసి ఆనందంగా గడిపారు.

December 30, 2024 / 07:26 AM IST

ఈ నెల 31నే పింఛన్ల పంపిణీ

NLR: ఈ నెల 31న పింఛన్లు అందజేస్తామని పంచాయతీ అధికారులు మనుబోలు మండలం కొమ్మలపూడి గ్రామంలో ఆదివారం వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. జనవరి 1న కొత్త సంవత్సరం కావడంతో పింఛన్లు ఒక రోజు ముందుగానే ఇస్తామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వాయిస్ రికార్డ్ చేసి ఓ వ్యక్తితో సైకిల్‌పై గ్రామాలలో మైక్ ద్వారా ప్రచారం నిర్వహించారు.

December 30, 2024 / 07:25 AM IST

విజయనగరం ఎంపీని కలిసిన పాలకొండ నాయకులు

SKLM: పాలకొండ, పలాసకు రైల్వే లైన్ ఏర్పాటుకు కృషి చేస్తున్న ఎంపీ అప్పలనాయుడుని పాలకొండ నియోజకవర్గం పెద్దలు సోమవారం ఎచ్చెర్లలో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రతిపాదిత రైల్వే, రోడ్డు ఏర్పాటు చేస్తే ప్రధానంగా ఈ మార్గంలో ఉన్న ఏజెన్సీ ప్రాంతం రవాణా, వైద్య, విద్యాపరంగా అభివృద్ధి చెందుతుందని వారు తెలిపారు. ఇందులో అప్పలనాయుడు, చౌదరి నాయుడు, పాల్గొన్నారు.

December 30, 2024 / 07:22 AM IST

వెంకటగిరి యువతకు హెచ్చరిక

NLR: కొత్త సంవత్సరంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలను ప్రోత్సహించే ప్రసక్తే లేదని వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవీ రమణ తెలిపారు. రోడ్లమీద కేకులు కట్ చేయడం, మద్యం సేవించి బయట తిరగడం ఇలాంటివి ఏం చేసినా సహించే ప్రసక్తే లేదని తెలిపారు.

December 30, 2024 / 07:22 AM IST