NDL: నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల, జూపాడు బంగ్లా మండలాల కేసీ కెనాల్ ఆయకట్టు రైతుల విన్నపం మేరకు ఎంపీ డా. బైరెడ్డి శబరి, కలెక్టర్ జి.రాజకుమారి సహకారంతో సోమవారం సాగునీరు విడుదల చేయించారు. మల్యాల, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాల నుంచి నీటిని విడుదల చేయగా.. పంటలు రక్షించబడ్డాయని రైతులు ఎంపీ, కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు.