• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

చందాలు వేసుకుని రహదారి నిర్మాణం చేపట్టారు

VSP: గూడెంకొత్తవీధి మండలంలోని ఏబులం పంచాయతీ పరిధి కుమ్మరివీధికి రహదారి నిర్మాణం చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. రహదారి నిర్మాణం కోసం అధికారులకు పాలకులకు ఎన్నోసార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతో గ్రామస్తులంతా చందాలు వేసుకొని జేసీబీ సహాయంతో సొంతంగా రహదారి నిర్మాణం చేపట్టారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ కష్టాలు తీర్చాలని కోరారు.

December 30, 2024 / 10:16 AM IST

ఈ రోడ్డుపై నడిచేదెలా…..?

ప్రకాశం: పామూరు నుండి కందుకూరు వెళ్ళే ప్రధాన రహదారి ఇటీవల కురిసిన వర్షాలకు అధ్వాన్నంగా తయారైంది. ముఖ్యంగా పామూరులో రోడ్డు మధ్యలో గుంతలు ఏర్పడి, అంచుల్లో వర్షపు నీరు చేరడం వల్ల రాకపోకలు సాగించే వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై ఎలా వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. అధికారులు రోడ్డు మరమ్మత్తులు చేపట్టి సమస్యకు పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.

December 30, 2024 / 10:16 AM IST

కడప దర్గాపై దుష్ప్రచారం.. జిల్లా వ్యక్తులు అరెస్ట్

ATP: ప్రసిద్ధి చెందిన కడప పెద్ద దర్గాపై దుష్ప్రచారం చేసిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు కడప టూ టౌన్ సీఐ నాగార్జున తెలిపారు. అనంతపురం నగరానికి చెందిన షకిల్ షఫీ, నూర్ బాబా, బాజీలు ఇటీవల దర్గాపై సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం చేసినట్లు ఆయన వెల్లడించారు. దీంతో దర్గా మేనేజర్ అలీ ఖాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు.

December 30, 2024 / 10:15 AM IST

త్వరలో మెట్రో పనులు ప్రారంభం: ఎంపీ చిన్ని

కృష్ణా: విజయవాడ ఆటోనగర్, మురళీనగర్ నుంచి బల్లెంవారి వీధి వరకు ఉన్న రోడ్లను సోమవారం MLA గద్దె రామ్మోహన్, కలెక్టర్ లక్ష్మీశ, ML కేశినేని చిన్ని పరిశీలించారు. త్వరలో ప్రారంభం కానున్న మెట్రో ఏలూరు రోడ్డు ఫ్లైఓవర్ పనుల వల్ల ట్రాఫిక్కు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేస్తామని అన్నారు.

December 30, 2024 / 10:13 AM IST

గుత్తి పురపాలక పింఛన్‌దారులకు శుభవార్త

ATP: గుత్తి పురపాలక పింఛన్‌దారులకు జనవరి 1వ తేదీ పంపిణీ చేసే పింఛన్‌లను డిసెంబర్ 31వ తేదీ ఒకరోజు ముందుగానే పంపిణీ చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా సోమవారం మీడియాకు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు నూతన సంవత్సరం సందర్భంగా పింఛన్‌లను ఒక్కరోజు ముందుగానే పంపిణీ చేస్తున్నామన్నారు.

December 30, 2024 / 10:03 AM IST

గోపాలపురంలో ఏటీఎం ధ్వంసం

W.G: గోపాలపురంలోని ఆదివారం అర్ధరాత్రి SBI ఏటీఎంను గుర్తు తెలియని దుండగలు ధ్వంసం చేశారు. ఎవరూ లేని సమయంలో రాయితో ఏటీఎం ధ్వంసానికి పాల్పడ్డారు. వెంటనే సైరన్ మోగడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు ఆగి మందలించే క్రమంలో దుండగులు పరారయ్యారు. స్థానికులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

December 30, 2024 / 10:01 AM IST

గాల్లోకి ఎగిరిన కారు.. మహిళ స్పాట్ డెడ్

ప్రకాశం: రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని చిదిమేసింది. టంగుటూరు మండలం వెంకటాయపాలెం గ్రామానికి చెందిన లక్కె పద్మ(47), ఆమె కుమార్తెలు లక్ష్మీ, మాధవిలు బొంతలు కుట్టుకుని జీవిస్తున్నారు. ఆదివారం వాళ్ళు ఆటోలో ఒంగోలు వెళ్తుండగా.. పెళ్లూరు వద్ద డివైడర్‌ని ఢీకొన్న ఓ కారు గాల్లో ఎగిరి ఆటోపై పడింది. ఘటనలో పద్మ స్పాట్ డెడ్ కాగా మిగిలిన వారికి తీవ్ర గాయలు అయ్యాయి.

December 30, 2024 / 09:58 AM IST

జనవరి 4న జిల్లాస్థాయి విద్యా విజ్ఞాన పోటీ

కోనసీమ: పి.గన్నవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద వచ్చే నెల 4న జిల్లాస్థాయి విద్యా విజ్ఞాన ప్రదర్శన పోటీలను నిర్వహిస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీం భాషా తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ పోటీలను కలెక్టర్ మహేశ్ కుమార్, పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రారంభిస్తారని తెలిపారు.

December 30, 2024 / 09:49 AM IST

వైసీపీపై విమర్శలు గుప్పించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

NDL: వైసీపీపై రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోమవారం నాడు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. బనగానపల్లె పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలు చేసినందు వల్లే విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగిందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు.

December 30, 2024 / 09:48 AM IST

‘తానేటి వనిత పార్టీ మారుతున్నారంటూ అసత్య ప్రచారం’

E.G: మాజీ హోం మంత్రి తానేటి వనిత పార్టీ మారుతున్నారని వస్తున్న అసత్య ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు వైసీపీ ద్వారకాతిరుమల మండల మహిళా అధ్యక్షురాలు మల్లెపూడి నాగమణి అన్నారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. పార్టీ ఏకార్యక్రమానికి పిలుపునిచ్చిన వనిత ఆధ్వర్యంలో విజయవంతం చేస్తున్నామని, ఇది గిట్టని వారు కావాలనే వనితపై దిగజారుడు రాజకీయం చేస్తున్నారన్నారు.

December 30, 2024 / 09:36 AM IST

లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. ముగ్గురికి స్వల్పగాయాలు

E.G: దేవరపల్లి మండలంలోని డైమండ్ జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. వైజాగ్ నుంచి గుంటూరు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు లారీను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. హైవే  క్షతగ్రాతులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

December 30, 2024 / 09:34 AM IST

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు దుర్మరణం

CTR: నడిచి వెళ్తున్న వృద్ధుడిని కారు ఢీకొన్న ఘటనలో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చౌడేపల్లి మండలం దుర్గ సముద్రం వద్ద సోమవారం చోటుచేసుకుంది. దుర్గసముద్రం గ్రామానికి చెందిన చెంగప్ప(60) దుర్గ సముద్రం మెయిన్ రోడ్డులో వెళ్తుండగా బండమీదపల్లె వైపు నుంచి వస్తున్న కారు ఢీకొని వెళ్లిపోయింది. ఈ ఘటనలో చంగప్ప అక్కడికక్కడే మృతి చెందాడు.

December 30, 2024 / 09:31 AM IST

గుండెపోటుతో వైసీపీ సోషియల్ మీడియా నేత మృతి

ATP: ఉమ్మడి జిల్లా పార్లమెంట్ వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్, అధ్యక్షుడు ప్రవీణ్ సాయి విఠల్ గుండెపోటుతో అనంతపురంలో మరణించారు. ఆదివారం రాత్రి ఆయన తుది శ్వాస విడవగా విఠల్ మృతిపై వైసీపీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరో వైపు మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. పార్టీ కోసం నిరంతరం కష్టపడే ప్రవీణ్ సాయి విఠల్ మృతి చాలా బాధాకరమని వైసీపీ ట్వీట్ చేసింది.

December 30, 2024 / 09:26 AM IST

జనవరి 1న అందుబాటులో కదిరి ఎమ్మెల్యే

ATP: కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అనివార్య కారణాలతో డిసెంబర్ 31న జన్మదిన వేడుకలు చేసుకోవడంలేదని ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ప్రకటన వెలువడింది. అలాగే జనవరి 1న స్థానిక ఆర్అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఎమ్మెల్యే అందుబాటులో ఉంటారని పేర్కొంది. శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే ప్రజలు బొకేలు, కేక్‌కు తీసుకురావొద్దని సూచించారు.

December 30, 2024 / 09:23 AM IST

సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి: డీఎస్పీ

VSP: నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేవారు ముందుగా పోలీసు అనుమతులు తీసుకోవాలని పాడేరు డీఎస్పీ కే.ప్రమోద్ సూచించారు. స్థానిక లాడ్జిల యజమానులు, వంజంగి రిసార్టుల నిర్వాహకులతో ఆయన సోమవారం సమావేశం నిర్వహించారు. లాడ్జి, రిసార్టుల ఎంట్రీ, ఎగ్జిట్ ప్రదేశాల్లో సీసీ టీవీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించరాదని హెచ్చరించారు.

December 30, 2024 / 09:22 AM IST