NDL: మహానంది గ్రామంలో ఆలయ ఉద్యోగి చల్లగాలి లక్ష్మయ్య సోమవారం ఉరివేసుకుని మృతి చెందాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు కుటుంబ కలహాలా?, అనారోగ్య సమస్యలా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.