PLD: గరికపాడు గ్రామంలో సోమవారం రాత్రి పర్యటించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, అక్కడ నిర్వహించిన గ్రామ సభలో పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో మౌలిక వసతుల మెరుగుదల కోసం ఏప్రిల్ నెలలో రూ. 20 లక్షలు విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మొఘల్ జాను, కూటమి నాయకులు పాల్గొన్నారు.