కోనసీమ: అంబాజీపేట జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల చేత పనులు చేయిస్తున్న సమయంలో గాయపడిన చప్పిడి మణికంఠ గాయాలు పాలైన విషయం తెలిసిందే. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మణికంఠను RSU విద్యార్థి సంఘం నాయకులు సోమవారం పరామర్శించారు. RSU రాష్ట్ర ఉపాధ్యక్షులు కంటేపల్లి నరేంద్ర మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల చేత పాఠశాలలో పనులు చేయించడం సరికాదన్నారు.