NDL: గోస్పాడు మండలానికి ప్రభుత్వం స్వచ్ఛ రథం మంజూరు చేసినట్లు ఎంపీడీవో షేక్ అమానుల్లా ఒక ప్రకటన తెలిపారు. ‘స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా గ్రామాల పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ ఈ రథాన్ని అందించారని పేర్కొన్నారు. ఇది ప్రతి రోజు గ్రామాల్లో తిరిగి పొడి, తడి చెత్తతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రజల నుంచి సేకరిస్తుందని వివరించారు.