కడప రిమ్స్ సమీపంలో ఇవాళ తెల్లవారుజామున దారుణ హత్య చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శనివారం కడప శివారులోని అలంఖాన్పల్లి జాతరలో గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో దస్తగిరి అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా కత్తితో పొడిచి హతమార్చారు. ఈ ఘటనలో దస్తగిరి అక్కడికక్కడే మృతిచెందగా.. ఆయన కుమారుడికి గాయాలై నిమ్స్ చికిత్స పొందుతున్నారు.