NDL: వెనుకబడిన రాయలసీమను 12 జిల్లాలతో కూడిన ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసినప్పుడే అభివృద్ధి సాధ్యమని రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ జాతీయ అధ్యక్షుడు కొంచెం వెంకటసుబ్బారెడ్డి పేర్కొన్నారు. సోమవారం చాగలమర్రిలో నాయకులతో కలిసి మాట్లాడారు. దశాబ్దాలుగా పాలకులు సీమకు అన్యాయం చేస్తూనే ఉన్నారని విమర్శించారు. రాయలసీమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆయన డిమాండ్ చేశారు.