NDL: నందికొట్కూరు మండలం కొణిదెల భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం సందర్భంగా ఈ నెల 28న బండలాగుడు పోటీలు నిర్వహించనున్నారు. విజేతలకు మొదటి బహుమతిగా రూ.40 వేలు, వరుసగా రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.12 వేల నగదు పురస్కారాలు అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఎద్దుల యజమానులు ఈ పోటీల్లో పాల్గొనాలని వారు కోరారు.