ELR: రాష్ట్రంలో నిరక్షరాస్యత నిర్మూలనే ధ్యేయంగా చేపట్టిన ‘అక్షర ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 28న ప్రీ-ఫైనల్, 29న ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 3,350 కేంద్రాల్లో దాదాపు 97,200 మంది అభ్యాసకులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆమె వెల్లడించారు.