ప్రకాశం: గిద్దలూరు మండలం బురుజుపల్లి తాండాకు చెందిన గణేష్ నాయక్ కృష్ణాజిల్లా పెనమలూరులో రైల్వే ట్రాక్పై అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. గణేష్ నాయక్ పెనమలూరులోని ఓ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. గణేష్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. గిద్దలూరులో గోబీ బండి నడుపుకుంటూ గణేష్ తల్లిదండ్రులు జీవనం సాగిస్తున్నారని స్థానికులు తెలిపారు.