అన్నమయ్య: నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా మార్చడమే ‘ఉల్లాస్-అక్షర ఆంధ్ర కార్యక్రమం లక్ష్యమని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. మదనపల్లి కలెక్టరేట్లో గోడ పత్రికలను విడుదల చేసిన ఆయన, 2029 నాటికి వయోజనులందరికీ అక్షరాస్యతతో పాటు డిజిటల్, ఆర్థిక నైపుణ్యాలు అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వయోజన విద్య శాఖ అధికారులు పాల్గొన్నారు.