W.G: భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా 19 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. అలాగే, నిర్ణీత గడువులోగా బాధితులకు న్యాయం జరగాలన్నారు. అధికారులు ప్రజా ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని సూచించారు.