• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మండపేటలో పాలకేంద్రాలపై విస్తృత తనిఖీలు

E.G: మండపేట పురపాలక సంఘ కమిషనర్ టి.వి.రంగారావు ఆదేశాల మేరకు శానిటరీ ఇన్‌స్పెక్టర్ ముత్యాల సత్తిరాజు ఆధ్వర్యంలో శానిటేషన్ సెక్రటరీలు మండపేటలోని పాల కేంద్రాలను తనిఖీ చేశారు. మండపేట పట్టణ పరిధిలో ఉన్న 16 పాలకేంద్రాలలో గురువారం సాయంత్రం తనిఖీలు నిర్వహించారు. పాల ఉత్పత్తులు నాణ్యత పరిశీలించి, ఏ విధమైన పాల ఉత్పత్తులు నిల్వ ఉంచరాదని పేర్కొన్నారు.

February 26, 2026 / 07:24 PM IST

‘ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు’

ASR: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యం తగదని టీడీపీ అరకు ఇన్‌ఛార్జ్, ఏపీఎస్ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ సియ్యారి దొన్ను దొర హెచ్చరించారు. ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి నేతలు స్వప్రయోజనాలకు కాకుండా ప్రజల పక్షాన అధికారుల వద్దకు వస్తారని స్పష్టం చేశారు. వారి సమస్యల పట్ల అలసత్వం వహిస్తే అధికారులపై కఠిన చర్యలు తప్పవని తేల్చి చెప్పారు.

February 26, 2026 / 07:21 PM IST

స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ

తూ.గో: ఢిల్లీలో జరిగిన కార్మిక, జౌళీ మరియు నైపుణ్యాభివృద్ధి పార్లమెంటరీ కమిటీ సమావేశంలో అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి పాల్గొన్నారు. ఈ సమావేశంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ, జౌళీ మంత్రిత్వ శాఖ, కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖల గ్రాంట్ల డిమాండ్లను కమిటీ పరిశీలించినట్లు తెలిపారు.

February 26, 2026 / 07:17 PM IST

పెండింగ్ ప్రతిపాదనలకు త్వరిత ఆమోదం కోరిన మంత్రి

అన్నమయ్య: రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి అదనపు నిధులు మంజూరు చేయాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని కలిశారు. టెంపుల్స్ డెవలప్‌మెంట్ ఫండ్ సహా పలు పథకాల కింద ఇప్పటికే రూ.17 కోట్లు విడుదలైనట్లు, మరో రూ.20 కోట్ల ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. పెండింగ్ ప్రతిపాదనలకు త్వరిత ఆమోదం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

February 26, 2026 / 07:15 PM IST

భక్తుల సౌకర్యం కోసం మెట్లు ఏర్పాటు

AKP: మాడుగుల సమీపంలోని తాచేరు నది వద్ద భక్తుల సౌకర్యార్థం మెట్లు ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. గురువారం సర్పంచ్ యడ్ల కళావతి, వైస్ ఎంపీపీ పొలిమేర విజయలక్ష్మి, ఉప సర్పంచ్ జవ్వాది వరహాలు ఈ పనులను ప్రారంభించారు. పంచాయతీ నిధులతో నిర్మిస్తున్న ఈ మెట్ల ద్వారా భక్తులు సులభంగా నదిలోకి వెళ్లి స్నానం చేయగలరని చెప్పారు.

February 26, 2026 / 07:14 PM IST

‘పారిశుద్ధ్య కార్మికుల జీతాలు చెల్లించాలి’

NDL: సుండిపెంట గ్రామపంచాయతీ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఐదు నెలలుగా జీతాలు ఇవ్వబడలేదని వారు మండిపడ్డారు. కుటుంబాలతో అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని చెప్పుకొచ్చారు. కార్మికులకు పీఎఫ్, ఈపీఎఫ్, ఆరోగ్య-పని భద్రత వంటి హక్కులు అమలు చేయాలని కోరారు. సమస్య పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.

February 26, 2026 / 07:14 PM IST

‘స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలి’

PPM: జిల్లా ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. ఆయన గురువారం మాట్లాడుతూ.. జిల్లాలోని గిరిజన, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించాలని కోరారు. ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎమ్ నియామకం అంటే డబ్బులు లేవని చెప్పడం హాస్యాస్పదం అన్నారు.

February 26, 2026 / 07:12 PM IST

ఆదురుపల్లిలో వాహనాల తనిఖీలు హెల్మెట్ తప్పనిసరి: ఎస్సై

నెల్లూరు: చేజర్ల మండలం ఆదురుపల్లిలో గురువారం చేజర్ల ఎస్సై తిరుమలరావు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ బుక్, ఇన్సూరెన్స్ పత్రాలు పరిశీలించారు. సరైన పత్రాలు లేని వాహనాలకు చలానాలు విధించి హెచ్చరికలు జారీ చేశారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్సై సూచించారు.

February 26, 2026 / 07:11 PM IST

అంబేద్కర్ గురుకులంలో ప్రవేశాలకు పరీక్ష

VZM: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గురుకులంలో 5వ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశానికి మార్చి 1న ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ కె. ఉషారాణి తెలిపారు. 1న ఆదివారం 5వ తరగతికి ఉదయం 9.30 నుండి 11.00 గంటల వరకూ అలాగే జూనియర్ ఇంటర్మీడియట్ 12 నుంచి మధ్యాహ్నం 1.30 గంటలు వరకూ ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.

February 26, 2026 / 07:10 PM IST

యద్దనపూడిలో కార్డన్ సెర్చ్ నిర్వహణ

BPT: యద్దనపూడి మండలంలోని అనంతవరం ఎస్టీ కాలనీలో గురువారం ఎస్సై రత్నకుమారి ఆధ్వర్యంలో పోలీసులు ‘కార్డెన్ అండ్ సెర్చ్’ నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని 7 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు, అనుమానాస్పద వ్యక్తుల కదలికల నివారణకు ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఎస్సై స్పష్టం చేశారు.

February 26, 2026 / 07:10 PM IST

‘వెట్టిచాకిరీ రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలి’

SKLM: జిల్లాలో వెట్టి చాకిరీని పూర్తిగా రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. వెట్టిచాకిరీ వ్యవస్థ నిర్మూలన చట్టం అమలులోకి వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం జిల్లా కోర్టు ఆవరణలో అవగాహన పోస్టర్లను ఆవిష్కరించి, సంచార వాహనాన్ని ప్రారంభించారు. ఇందులో సీనియర్ న్యాయవాదులు ఉన్నారు.

February 26, 2026 / 07:09 PM IST

కల్తీ పాల, కలుషిత జలాల సమస్యపై సీఎం చంద్రబాబు సమీక్ష

E.G: సీఎం చంద్రబాబు గురువారం అమరావతి నుంచి తూ.గో, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలులతో కల్తీ పాలు, కలుషిత జలాల పరిస్థితిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం క్షేత్ర స్థాయిలో ప్రస్తుత పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తత కలిగి ఉండాలన్నారు. స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కీర్తి చేకూరి పాల్గొన్నారు.

February 26, 2026 / 07:07 PM IST

అసెంబ్లీలో బొగ్గరం విద్యార్థుల సందడి

PLD: శాసనసభ సందర్శనలో భాగంగా ఈపూరు మండలం బొగ్గరం జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు గురువారం అసెంబ్లీకి విచ్చేశారు. వారికి ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సాదరంగా స్వాగతం పలికి, విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ప్రజా సమస్యలపై సభలో చర్చలు ఎలా జరుగుతాయో వివరించిన ఆయన, విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు.

February 26, 2026 / 07:03 PM IST

‘డ్రైవింగ్ స్కూల్స్‌పై తనిఖీలు చేపట్టాలి’

KDP: జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న డ్రైవింగ్ స్కూల్స్‌పై రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి చర్యలు చేపట్టాలని DYFI జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్ డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. కొన్ని స్కూల్స్‌లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, అనుభవం లేని బోధకులు ఉండడం, ట్రాఫిక్ నియమాలపై సరైన అవగాహన కల్పించకపోవడం జరుగుతోందని ఆరోపించారు.

February 26, 2026 / 07:03 PM IST

కొవ్వూరు సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే

E.G: అమరావతిలో CM చంద్రబాబును కొవ్వూరు MLA ముప్పిడి వెంకటేశ్వరరావు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు 2027 గోదావరి పుష్కరాలు దృష్ట్యా కొవ్వూరులోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నిర్మించాలని, ప్రభుత్వ ఆసుపత్రి 50 పడకల నుండి 150 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని కోరారు. 5 ఎత్తి పోతల పథకాలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు అందించారు.

February 26, 2026 / 07:02 PM IST