BPT: యద్దనపూడి మండలంలోని అనంతవరం ఎస్టీ కాలనీలో గురువారం ఎస్సై రత్నకుమారి ఆధ్వర్యంలో పోలీసులు ‘కార్డెన్ అండ్ సెర్చ్’ నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని 7 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు, అనుమానాస్పద వ్యక్తుల కదలికల నివారణకు ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఎస్సై స్పష్టం చేశారు.