SKLM: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు జిల్లా కలెక్టరేట్లో గురువారం అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. డయేరియా కారణాల అన్వేషణతో పాటు భవిష్యత్లో ఎప్పుడు కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రీసెట్ బటన్ ఆన్ చేశారు. ఇకపై నీటి నమూనాల పరీక్షకు విశాఖపట్నం వరకు వెళ్ళకుండా సంబంధిత కేంద్రాన్ని స్థానికంగా ఏర్పాటు చెయ్యాలని కలెక్టర్ను ఆదేశించారు.
KRNL: కోసిగి(మం) జంపాపురంలోని బసవేశ్వర స్వామి దేవాలయం వార్షిక జాతర మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఇవాళ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మంత్రాలయం టీడీపీ ఇంఛార్జి రాఘవేంద్ర రెడ్డి తనయులు యువ నాయకులు రాకేష్ రెడ్డి, రాజారెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు, శాంతి, అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు.
కడప కందిపాలెంలో దళిత మాజీ సైనికుడి ఇంటిని కూల్చివేసి నెల రోజులు గడిచినా బాధితులకు న్యాయం జరగలేదు. ఈ నేపథ్యంలో బాధితులు, అఖిలపక్ష నేతలు ఘటనా స్థలంలో శాంతి హోమం నిర్వహించి, రాజ్యాంగ ప్రతులతో నిరసన తెలిపారు. అర్ధరాత్రి ఇల్లు కూల్చడం అమానుషమని, ఇది రాజ్యాంగ హక్కులపై దాడి అని నేతలు విమర్శించారు. పోలీసుల దర్యాప్తు పారదర్శకంగా జరగాలన్నారు.
ELR: Havells పేరుతో నకిలీ వైర్లు విక్రయిస్తున్నట్లు గుర్తించి ఏలూరు పవర్ పేటలోని మహావీర్ ఎలక్ట్రికల్స్పై డీఎస్పీ శ్రావణ్ కుమార్ ఆదేశాలతో పోలీసులు దాడి చేశారు. భారీగా నకిలీ వైర్లు స్వాధీనం చేసుకుని, కంపెనీ ప్రతినిధుల ధృవీకరణతో నిందితుడు కుమార్ జైన్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రజలు కొనుగోళ్లలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
గుంటూరు జీజీహెచ్ ప్రధాన ద్వారం వద్ద గురువారం ఓ గుర్తుతెలియని వృద్ధుడు అనారోగ్యంతో మృతి చెందారు. అస్వస్థతతో పడి ఉన్న ఆయనను సెక్యూరిటీ సిబ్బంది గమనించి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. మృతుని వివరాలు తెలిసిన వారు కొత్తపేట పోలీస్ స్టేషన్లో సంప్రదించాలన్నారు.
TPT: ఎర్రవారిపాలెంలోని IIT తిరుపతిలో శుక్రవారం (ఫిబ్రవరి 27, 2026) ‘డెకాయిట్’ కార్యక్రమం జరగనుంది. ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథులుగా డెకాయిట్ సినిమా హీరో అజిత్ కుమార్ రేసింగ్ టీం సభ్యులు పాల్గొననున్నారు. అలాగే విద్యార్థులతో వారు ప్రత్యేకంగా మాట్లాడనున్నారు.
అన్నమయ్య: రైల్వే కోడూరు(మం) జంగిటి వారిపల్లికు చెందిన కొండేటి విజయలక్ష్మికు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.30,795 విలువైన చెక్కును టీడీపీ పార్టీ ఇంఛార్జ్, KUDA ఛైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి వారి నివాసం వద్ద అందజేశారు. ఈ సందర్భంగా ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు ప్రభుత్వం అండగా నిలవడం బాధ్యత అని తెలిపారు.
NLR: రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకొని అర్హులైన నిరుపేదలకు త్వరితగతిని ఇంటి స్థలాలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అధికారులను ఆదేశించారు. నెల్లూరులోని వీపీఆర్ నివాసంలో హౌసింగ్, రెవెన్యూ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా గిరిజనులకు మంజూరైన 1,000 పక్కా గృహాలకు భూసేకరణ చేయాలని ఆదేశించారు.
VZM: జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 53 మంది వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి నిందితులను మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.5.30 లక్షల జరిమానా విధించారు. ఈ జరిమానాలను అడిషనల్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ MSHR తేజ చక్రవర్తి విధించినట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు.
సత్యసాయి: సోమందేపల్లిలోని వినాయక నగర్కు చెందిన చేనేత కార్మికుడు ఖలీల్ మద్యం మత్తులో గురువారం మృతి చెందారు. ఖలీల్ అధికంగా మద్యం సేవించి బ్రాందీ షాపు వద్ద అపస్మారక స్థితిలో పడిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబం పూర్తిగా చేనేత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.
ATP: గుత్తి మండలం బాచుపల్లి గ్రామంలో భూ తగాదా విషయంలో గురువారం బసీనేపల్లి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు నూర్ భాషాపై వైసీపీ నాయకులు దాడి చేసి గాయపరిచారు. ఈ దాడిలో నూర్ భాషాకు గాయాలయ్యాయి. గాయపడిన అతన్ని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
VSP: ప్రముఖ పర్యాటక కేంద్రం రుషికొండ బీచ్లో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. సముద్ర స్నానానికి దిగిన ఓ పర్యాటకుడు అలల ఉద్ధృతికి లోనై నీటిలో మునిగి మృతి చెందారు. మృతుడు ఏ ప్రాంతానికి చెందినవారో సహా పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా, ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
CTR: వికలాంగులకు, వృద్ధులకు నిత్యవసర వస్తువులను ఇంటి వద్దే అందించాలని పెద్దపంజాణి తహసీల్దార్ రామ్మూర్తి డీలర్లును ఆదేశించారు. గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రేషన్ డీలర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. రేషన్ డీలర్లు సమయపాలన పాటించి ప్రతినెల 1వ తేదీ నుంచి రేషన్ షాప్కి వచ్చిన వస్తువులను పంపిణీ చేయాలని అన్నారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సెంట్రల్ కమిటీ ఛైర్మన్ మానవత(ఆలపాటి) నాగేశ్వరరావు సంస్మరణ సభ గురువారం ఏలూరులోని లయన్స్ క్లబ్ కల్యాణ మండపంలో జరిగింది. ఈ సందర్భంగా ఉండి మానవత సంస్థ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు, ట్రెజరర్ కేటీన్ సత్యనారాయణ, మండల ఛైర్మెన్ రుద్రరాజు యువరాజు, కో ఛైర్మన్ దంగేటి రామలింగేశ్వరరావులు పాల్గొని పుష్పంజలి ఘటించారు.
VZM: జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు ఫిబ్రవరి 28న నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈవో సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు 1 నుండి 7వ స్థాయి సంఘాల సమావేశాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఈ సమావేశాలకు సంబంధిత అధికారులు, కమిటీ సభ్యులు అందరూ హాజరై అభివృద్ధి పనులపై చర్చించాలని కోరారు.