నెల్లూరు: చేజర్ల మండలం ఆదురుపల్లిలో గురువారం చేజర్ల ఎస్సై తిరుమలరావు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ బుక్, ఇన్సూరెన్స్ పత్రాలు పరిశీలించారు. సరైన పత్రాలు లేని వాహనాలకు చలానాలు విధించి హెచ్చరికలు జారీ చేశారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్సై సూచించారు.