NDL: సుండిపెంట గ్రామపంచాయతీ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఐదు నెలలుగా జీతాలు ఇవ్వబడలేదని వారు మండిపడ్డారు. కుటుంబాలతో అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని చెప్పుకొచ్చారు. కార్మికులకు పీఎఫ్, ఈపీఎఫ్, ఆరోగ్య-పని భద్రత వంటి హక్కులు అమలు చేయాలని కోరారు. సమస్య పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.