AKP: మాడుగుల సమీపంలోని తాచేరు నది వద్ద భక్తుల సౌకర్యార్థం మెట్లు ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. గురువారం సర్పంచ్ యడ్ల కళావతి, వైస్ ఎంపీపీ పొలిమేర విజయలక్ష్మి, ఉప సర్పంచ్ జవ్వాది వరహాలు ఈ పనులను ప్రారంభించారు. పంచాయతీ నిధులతో నిర్మిస్తున్న ఈ మెట్ల ద్వారా భక్తులు సులభంగా నదిలోకి వెళ్లి స్నానం చేయగలరని చెప్పారు.