KRNL: దేవాలయ భూములు ప్రభుత్వ ఆస్తులు కావని, వాటిని అన్యాక్రాంతం చేసే హక్కు ఎవరికీ లేదని ఆదోని MLA పార్థసారధి అసెంబ్లీలో పేర్కొన్నారు. ఆలయ భూములను లీజులు, స్టేడియాలకు కేటాయించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆలయ భూములను ప్రభుత్వం కాపాడాలని, ధార్మిక సంస్థల అభిప్రాయాలతో సంరక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
W.G: సిబ్బంది నిర్లక్ష్యం ఒక వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. తణుకు మండలం తేతలి వద్ద బుధవారం రాత్రి బైకుపై వెళ్తున్న వడ్లూరుకు చెందిన రాంబాబు మెడకు ఇంటర్నెట్ కేబుల్ వైర్లు చుట్టుకున్నాయి. మరమ్మతులు చేస్తున్న సమయంలో సిబ్బంది అప్రమత్తంగా లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యలు ఆరోపించారు. మెడ భాగంలో గాయాలైన రాంబాబును ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
VSP: నాబార్డ్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 32,373 వేల కోట్ల పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ విడుదల చేసింది. జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ బ్యాంకర్ల సమావేశంలో ఆవిష్కరించారు. ఎంఎస్ఎంఈలకు రూ.22,368.75 వేత కోట్లు, వ్యవసాయానికి రూ.4,603.5 కోట్లు, ఇతర రంగాలకు రూ.5,401.1 కోట్లు కేటాయించారు. ప్రాధాన్యతా రంగాలకు రుణాలు విస్తరించాలని బ్యాంకులకు సూచించారు.
CTR: బైరెడ్డిపల్లె మండలంలో 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన వివిధ పనులకు సంబంధించి ఆడిట్ చేశారు. ఎంపీడీవో కార్యాలయం వద్ద మీటింగ్ నిర్వహించి ఆ వివరాలు వెల్లడించారు. పనుల్లో సిబ్బంది నిర్లక్ష్యం, రికార్డులు సక్రమంగా లేకపోవడం, దాదాపు రూ. 1.78 లక్షల వరకు అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు.
NLR: నెల్లూరు మేయర్ ఎన్నిక మరికాసేపట్లో జరగనుంది. కూటమి అభ్యర్థిగా దేవరకొండ సుజాత పేరు ప్రకటించారు. 54 డివిజన్లలో ఓ కార్పొరేటర్ రాజీనామా చేయగా 53మంది ఉన్నారు. 39మంది టీడీపీ కార్పొరేటర్లు కాగా.. వేమిరెడ్డి, కోటంరెడ్డి, నారాయణ ఎక్స్అఫీషియో ఓట్లతో కూటమి బలం 42గా ఉంది. వైసీపీలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి ఓటు, 14 మంది కార్పొరేటర్లు ఉండటంతో వారి బలం 15గా ఉంది.
NTR: విజయవాడలో AB కన్వీన్షన్ ఫంక్షన్ హాల్లో ఈరగాబి రమణారావు కుమార్తె, వివాహ రీసెప్సషన్ కార్యక్రమంలో నందిగామ మాజీ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు పాల్గోని నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ASR: ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిత్య అన్నదాన పథకానికి విజయవాడ ప్రసాదంపాడు వాస్తవ్యులు గంధం రాజేష్ కుమార్ కుటుంబ సభ్యులు రూ.5,00,001 విరాళాన్ని గురువారం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు ముందుగా స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు దాత కుటుంబ సభ్యులకు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
ATP: పామిడి శ్రీ భోగేశ్వర స్వామి ఆలయంలో భక్తాదులు స్వామి వారికి సమర్పించిన హుండీ కానుకలను బుధవారం లెక్కింపు చేశారు. ఆలయ ఈవో కృష్ణయ్య మాట్లాడుతూ.. గత ఏడాది మార్చి 28 నుండి ఈ ఏడాది ఫిబ్రవరి 25 వరకు భక్తాదులు స్వామి వారికి సమర్పించిన హుండీ కానుకలను లెక్కించగా రూ.1,58,811నగదు,3 గ్రాముల బంగారం, 94 గ్రాముల వెండి వచ్చిందని వారు మీడియాకు తెలిపారు.
SKLM: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నామని నరసన్నపేట జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బలగ ప్రవీణ్ తెలిపారు. గురువారం ఉదయం ఆయన మాట్లాడుతూ.. గతంలో 3300 సభ్యత్వాలు నమోదు చేశామన్నారు. అధినేత ఆదేశాల మేరకు మార్చి పదో తేదీ లోగా 10 వేల సభ్యత్వాలు లక్ష్యంగా చేసుకోవడం జరిగిందని వివరించారు.
అన్నమయ్య: మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెలో గురువారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి ఆధ్వర్యంలో 150మంది పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం, ఎస్టీఎఫ్, స్పెషల్ పార్టీ సిబ్బందితో రంగంలోకి దిగారు. కాట్లాటపల్లి, రోడ్డు, రామిరెడ్డిలేఔట్లో ప్రతి ఇంటిని పరిశీలించారు. 20 బైక్లను సీజ్ చేశారు.
KRNL: అస్వస్థతతో మృతి చెందిన గుర్తుతెలియని అనాధ వ్యక్తికి పూలే అంబేడ్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ సభ్యులు మానవతా దృక్పథంతో అంత్యక్రియలు బుధవారం నిర్వహించారు. ఎమ్మిగనూరు (మం) గోనెగండ్ల బైపాస్ రోడ్ హిందూ స్మశాన వాటికలో పూలమాలలు వేసి అంతక్రియలు పూర్తి చేశారు. సింగనేటి నరసన్న మహారాజ్ ఆధ్వర్యంలో జై భీమ్ ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
TPT: సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ అసెంబ్లీ క్రీడా పోటీల్లో క్యారమ్స్ విజేతగా నిలిచారు. అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రాంగణంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జరిగిన క్యారమ్స్ సింగిల్స్ పోటీల్లో పాల్గొన్న సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ అత్యంత ప్రతిభ కనబరచి విజేతగా నిలిచారు.
VZM: బొబ్బిలి డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న జీ. భవ్యారెడ్డిని అమరావతిలోని DGP కార్యాలయానికి బదిలీ చేస్తూ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. 2018 గ్రూప్-1 అధికారులపై వచ్చిన ఆరోపణలపై వాళ్ళందరిని ఆప్రధాన్యత కలిగిన పోస్టులలో ఉంచాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆమెను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కడప జిల్లాలో అంబేద్కర్ స్టడీ సర్కిల్ నిర్వహించిన అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన ఎస్సీ అభ్యర్థులు ఓబులేసు, హర్షసాయి వర్ధన్లకు బుధవారం కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి UPSC ప్రిలిమ్స్ కోచింగ్ కోసం డిజిటల్ ట్యాబ్లను అందజేశారు. ఈ ట్యాబ్లలో UPSC స్టడీ మెటీరియల్ ముందుగానే ఇన్బిల్ట్ చేయబడి ఉంది. ఇది వారి సివిల్స్ ప్రిపరేషన్కు ఎంతగానో ఉపయోగపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.
EG: సీతానగరం మండలం పురుషోత్తపట్నం నుంచి సీతానగరం వరకు గురువారం తారురోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. గత 6,7 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు పెద్దపెద్ద గోతులతో గుంతలమయంగా ఉండేదని స్కూల్ విద్యార్థులు, వ్యవసాయ కూలీలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకొనేవారమని స్థానికులు వాపోతున్నారు. ఈ రహదారి అభివృద్ధికి కృషి చేసిన ఎమ్మెల్యే బలరామకృష్ణకి అభినందనలు తెలిపారు.