VZM: మహిళా సాధికారత వారోత్సవాలలో భాగంగా పోలీసుల ఆధ్వర్యంలో కొత్తవలస పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగలపాలెంలో మహిళలకు ఉచిత వైద్య శిబిరం మంగళవారం నిర్వహించారు. మహిళలకు సాధారణ ఆరోగ్య పరీక్షలు, రక్తపోటు, షుగర్ పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సలహాలు అందించారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుందని వైద్యులు పేర్కొన్నారు.
KRNL: ఆదోని పట్టణంలోని తిరుమల నగర్లో మంగళవారం ఓ బ్యాంకు ఉద్యోగి ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు తాళాలు పగులగొట్టి బీరువాలోని రూ. 1,50,000 నగదు, ఆరు గ్రాముల బంగారం, 35 తులాల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, సంఘటనా స్థలానికి చేరుకున్న మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కృష్ణా: గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని పోలీసులతో ఎమ్మెల్యే రాము మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణంలో రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం దృష్ట్యా నెలకొన్న ట్రాఫిక్ రద్దీ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడకుండా సందర్భాన్ని బట్టి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు.
GNTR: పొన్నూరు నియోజకవర్గంలోని మూడు ప్రధాన రహదారుల అభివృద్ధికి రూ. 8.20 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మంగళవారం తెలిపారు. ఇందులో భాగంగా చింతలపూడి రోడ్డుకు రూ. 4.20 కోట్లు, గోవాడ రోడ్డుకు రూ. 3.50 కోట్లు, పాండ్రపాడు రోడ్డుకు రూ. 50 లక్షలు కేటాయించామని పేర్కొన్నారు. ఈ రహదారుల పనులను త్వరలోనే ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు.
నంద్యాల జిల్లా బయోలాజికల్ సైన్స్ టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో నేషనల్ సైన్స్ డే వారోత్సవాల సందర్భంగా “ఉమెన్ ఇన్ సైన్స్” థీమ్తో సెమినార్ నిర్వహించారు. ఉప విద్యాశాఖ అధికారి శంకర్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బయాలజీ విభాగంలో విశిష్ట సేవలందించిన, విద్యార్థులను రాష్ట్ర–జాతీయ సైన్స్ ఫెయిర్లకు ప్రోత్సహించిన ఉపాధ్యాయులను సన్మానించారు.
నెల్లూరులో మరోసారి బెట్టింగ్ ముఠా పట్టుబడింది. బుచ్చికి చెందిన మహేశ్ బాబు, హరికృష్ణ దుబాయ్ ట్రైనింగ్తో ‘Radhee Exchange App’ బెట్టింగ్ దందా నడుపుతున్నారు. నిందితులను బాలాజీ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.34.65 లక్షల నగదు, బ్యాంకుల్లోని రూ.1.64 కోట్లతో పాటు 13 సెల్ ఫోన్లు, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు.
సత్యసాయి: పెనుకొండ మండలంలోని మంత్రి సవిత నివాసంలో మంగళవారం అంగరంగ వైభవంగా హోలీ సంబరాలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మంత్రి సవిత రంగులు చల్లుకుంటూ ఆనందంగా వేడుకలు జరుపుకున్నారు. మంత్రి మాట్లాడుతూ.. అందరి జీవితాలు రంగులమయంగా ఉండాలని, ప్రతి ఒక్కరికి సంతోషం, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.
VSP: ఫిబ్రవరి 1 నుంచి భూముల విలువలు పెరుగుతాయని ప్రచారం ఉన్నా, ప్రభుత్వం వాయిదా వేయడంతో విశాఖలో రిజిస్ట్రేషన్లు తగ్గాయి. ఫిబ్రవరిలో 9 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు రూ.98 కోట్ల ఆదాయం వచ్చింది. 2025-26 లక్ష్యం రూ.1400 కోట్లు కాగా, ఇప్పటివరకు రూ.952 కోట్లు వసూలయ్యాయి.
అన్నమయ్య: చిన్నమండెం(మం) నూతన ఎమ్మార్వో రామాంజనేయులు మంగళవారం మధ్యాహ్నం బోరెడ్డిగారిపల్లి గ్రామంలోని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దుశ్యాలువా, పుష్పగుచ్ఛంతో సత్కరించారు. మండల అభివృద్ధి అంశాలపై మంత్రితో ఎమ్మార్వో చర్చించినట్లు సమాచారం.
TPT: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో వైద్య శిబిరం, పరస్పర చర్చా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో డా. మాధురి విద్యార్థినులకు ఆరోగ్య అవగాహన కల్పించారు. శక్తి టీమ్ మహిళల భద్రత, సైబర్ నేరాలపై సూచనలు ఇచ్చింది.
CTR: తిరుపతిలోని BIRRD హాస్పిటల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికగా ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, మెడికల్ ఆఫీసర్ తదితర 9 విభాగాల్లో మొత్తం 30 ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. అర్హతలు, ఇతర వివరాలకు అధికారిక వెబ్సైట్లో తెలుసుకోవచ్చన్నారు. చివరి తేదీ: మార్చి 13.
నెల్లూరు: కావలి పట్టణంలోని శ్రీ దుర్గా భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో బుధవారం 16 రోజుల పండుగ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు పుష్పయాగం, ఉంజల్ సేవ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకోవాలని కోరారు.
అన్నమయ్య: ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ను వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల జరిగిన దాడి ఘటనపై కుటుంబ సభ్యులతో మాట్లాడి సంఘీభావం తెలిపారు. జోగి రమేష్ సోదరుడు రాము, కుమారుడు రాజీవ్ను కలిసి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం స్థానిక నాయకులతో సమావేశమై పరిస్థితులపై చర్చించారు.
నెల్లూరు: రాపూరు అటవీ ప్రాంతంలో ప్రేమికుల జంట ఆత్మహత్యకు పాల్పడింది. రాపూరు-చిట్వేల్ ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద ఈ విషాద ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ముత్తుకూరుకు చెందిన ఆలపాక ప్రసన్న (25), తిరుపతి జిల్లా చిట్టమూరుకు చెందిన యాకసిరి సావిత్రి(24) ఒకే చెట్టుకు చున్నీలతో ఉరివేసుకుని ప్రాణాలు వదిలారు. పంగిలి గ్రామస్తుల సమాచారంతో రాపూరు పోలీసులు కేసు నమోదు చేశారు.