అన్నమయ్య: మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రి ఆర్ఎంవో డాక్టర్ రాధిక ఆస్పత్రిలోని డ్రగ్ స్టోర్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొరత ఉన్న మందుల వివరాలు.. అందుబాటులో ఉన్న మందుల వివరాలను అడిగి తెలుసుకుని రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా రాధిక మాట్లాడుతూ.. ఆసుపత్రికి వచ్చే రోగులకు మందుల కొరత రాకుండా చూసుకోవాలన్నారు.